' కే.జి.ఆర్.వి.యస్ ' ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం - వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు

' కే.జి.ఆర్.వి.యస్ ' ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం - వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు..


. వింజమూరు, ఏప్రిల్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో కొండా వారి నేతృత్వంలోని కొండా.గరుడయ్య, రామచంద్రయ్య, వెంకట సుబ్బయ్య (కే.జి.ఆర్.వి.యస్) చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అజరామరం అని తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు ప్రశంసించారు. స్థానిక తిరుమలానగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నాడు పలువురు బ్రాహ్మణులకు కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ తరపున బియ్యం, కూరగాయలు పంపిణీకి ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు సుధాకర్ రావు కొండా వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా స్వీయ నిర్భందం పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ సమయంలో ప్రతినిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని విభిన్న సందర్భాలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రస్ఫుటించాయన్నారు. దేవాలయాలకు సైతం లాక్ డౌన్ ఆం క్షలు వర్తించడంతో బ్రాహ్మణుల జీవనభృతి కి కూడా కొంతమేర అవరోధాలు ఏర్పడటం విధిగా మారిందన్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు మండలంలో పేద ప్రజలకు వంట సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు విరివిగా పంపిణీ చేసిన ఘనత కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ కు దక్కిందన్నారు. ఈ ట్రస్ట్ సభ్యులు తాజాగా మరొక  అడుగు ముందుకేసి నిరంతరం లోక సం రక్షణార్ధం వేద మంత్రాలు పఠించే బ్రాహ్మణోత్తములకు నిత్యావసరాలను అందజేయడం పట్ల కొండా వంశస్థులకు దైవ కృప ఎల్లవేళలా ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. కొండా.చినసుబ్బరాయుడు ధర్మపత్ని అమ్మణ్ణమ్మ పేరిట బియ్యం పంపిణీ చేయగా, కీ.శే.సుంకు.సుబ్బరత్నమ్మ భర్త మాలకొండలరావు, మెంటా.పద్మావతి- భర్త కీ.శే.వెంకటేశ్వర్లు, చీమకుర్తి.విజయలక్ష్మి-భర్త చంద్రశేఖరయ్యల సహాయార్ధం కూరగాయలు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కొండా.బాలజుబ్రహ్మణ్యం, కొండా.వెంకటసుబ్బారావు, కొండా.చినసుబ్బరాయుడు, కొండా.చినవెంకటేశ్వర్లు, కొండా.ఝాన్సీలక్ష్మి, కొండా.చర్షిత, కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ పర్యవేక్షకులు దుగ్గి.మధు, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు పి.తిరుమలాచార్యులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image