కేశినేని శ్వేత సారధ్యంలో  వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్ ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి కి మన్నించి వీడియో జర్నలిస్ట్స్ మరియు ఫోటో జర్నలిస్ట్స్ మిత్రులు విజయవాడలో పనిచేస్తున్న వారి అందరికి, కరోనా లక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో పెద్ద మనసుతో 
వీడియో జర్నలిస్టులు ,ఫోటో గ్రాఫర్స్ కు విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు నిత్యావసర సరుకులు ,బియ్యం పంపిణీ చేశారు..కేసినేని భవన్ లో ఎంపీ కుమార్తె కుమారి కేశినేని శ్వేత  వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్ ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని..వారు కుటుంబాలు ముఖ్యమని పేర్కొన్నారు.. వృత్తి పరంగా వివిధ వర్గాలు తో తిరిగే మీడియా ప్రతినిధుల ..జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు..        


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్స్ యూనియన్ తరుపున ఎంపి కేశినేని నాని గారికి మరియు కేశినేని శ్వేత గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.