పాలన ఎలా చేయాలో చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాలి :    దేవినేని ఉమా మహేశ్వర రావు

12.04.2020
విలేకర్ల సమావేశం వివరాలు
వైసీపీది అసమర్థ పాలన
పాలన ఎలా చేయాలో చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాలి
ప్రజల ప్రాణాలకంటే విశాఖ వెళ్లడమే జగన్ కు ముఖ్యం
ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెట్టడమేంటి?
                                                                  దేవినేని ఉమా మహేశ్వర రావు


కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల 90 వేల 550 కేసులు నమోదయ్యయి. లక్షా 9 వేల 654 మంది కరోనా బారిన పడి చనిపోయారు. భారతదేశంలో 8 వేల 731 కేసుల్లో 290 మంది చనిపోయినట్ట తెలుస్తోంది. ఏపీలో 405 కేసులు నమోదవగా ఆరుగురు చనిపోయారు. తెలంగాణలో 503 పాజిటివ్ కేసులు నమోదవగా 14 మంది చనిపోయారు. ఊరందరిదీ ఒక దారి ఉలిపి కట్టది ఒక దారి అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి.  దేశంలో అందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం జోన్లు , మండలాల గురించి మాట్లాడుతున్నారు. 30, 40 మండలాల్లోనే కరోనా ఉంది కాబట్టి జోన్ల వరకే లాక్ డౌన్ పరిమితం చేయమని మాట్లాడుతున్నారు. మూడు ముక్కలాటలో భాగంగా ఏప్రిల్ 28కల్లా తట్టాబుట్టా సర్దుకుని విశాఖ పట్నం వెళ్లడానికి రెడీ అవుతున్నారు. విశాఖపట్నం స్వామి పెట్టిన ముహూర్తానికే వెళ్లడానికి సిద్ధమైపోతున్నారు. సీఆర్డీఏ పరిధిలో ఈ రెండు రోజుల్లో ఇద్దరు రైతులు చనిపోయారు. భూములు ఇమ్మని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజధాని రైతులు ఆందోళనను పట్టించుకోకుండా గ్రూప్  కాన్ఫరెన్స్, స్కైప్ వీడియా కాన్ఫరెన్స్ కు రమ్మని రైతు కూలీల మీద ఒత్తిడి తేవడం వల్లే ఇద్దరు రైతులు చనిపోయారు. సుమారు 60 మంది రైతులు అమరావతి ప్రాంతంలో చనిపోయారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కరోనా  ఏం లేదని చెబుతున్నారు. ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చుకోవడం, ఉపాధి హామీతో రైతులను కాపాడే అంశాలను పక్కన పెట్టి కరోనాను 30, 40 మండలాలకు పరిమితం చేయండని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో చెబుతున్నారు.  మేము ఎన్నికలు పెట్టుకుంటాం, ఎలక్షన్ కమిషనర్ ను మార్చుకున్నామని మొండిగా ముందుకు పోతున్నారు.  రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు.  243 కే సబ్ క్లాజ్ 2 రాజ్యాంగంలో ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని ఇష్టానుసారంగా మార్చేసుకున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మార్చి 15న ఎస్ ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రాణాలను కాపాడారు. తమ ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడారని ప్రజలు జేజేలు పలికారు. ఆంధ్రా ప్రజలంతా మహేష్ బాబు స్పైడర్ సినిమా చూడండి అందులో భైరవుడు అనే క్యారెక్టర్ ఉంది. శాడిస్ట్ అతను. ప్రజలు చనిపోతూ ఉంటే భైరవుడు ఆనందపడతాడు. ప్రజలంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ చంద్రబాబు ప్రతి రోజూ ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ బాధ్యతలేని మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అమరావతి వస్తే క్వారంటైన్ లో పెడతామంటున్నారు. బుద్ది ఉందా మీకు ..చదువుకునే పిల్లలు, చిన్న పనులు చేసుకునే వారు తెలంగాణ సరిహద్దుల్లో కన్నీరు మున్నీరవుతుంటే మీరేం చేశారు...వారందరినీ తిప్పి పంపారు. వారిని 14 రోజులు క్వారంటైన్ లో పెట్టమని హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ కనగరాజ్ గారిని క్వారంటైన్ లో పెట్టారా?  ఇటు విజయవాడ, విశాఖ , హైదరాబాద్ , మద్రాస్ మధ్య ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న విజయసాయి రెడ్డి క్వారంటైన్ లో ఉన్నారా ? చెక్కులు పట్టుకుని పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. అంటే కోట్ల రూపాయల చెక్కులు తీసుకొస్తే క్వారంటైన్ లు అవసరం లేదు. ఉద్యోగాలు చేసుకుని ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని వచ్చిన వారు మాత్రం నిబంధనలు పాటించాలి. రాష్ట్ర ప్రతిపక్ష నేతను క్వారంటైన్ లో పెడతామంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలన చేతకాదు...పాదయాత్రలో పెద్ద మాటలు చెప్పారు జగన్ ..పాలన ఎవరి చేతుల్లో ఉంది? రాష్ట్ర ఖజానా ఎవరి చేతుల్లో ఉంది? ముఖ్యమంత్రి నేనా నువ్వా అని జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దీర్ఘాలు తీశారు . ఇవాళ తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి బయటకు కూడా రావడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పిల్లలు క్వారంటైన్ ల లెక్కల్లోకి రారు. ఐదు కోట్ల ప్రజలు, ప్రతిపక్ష నేత మాత్రం క్వారంటైన్ లో ఉండాలి. సిగ్గుందా మీకు? నోరు ఉందికదా అని హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారు...చెప్పమనండి నాకు పరిపాలన చేతకాదు, నేను పాలన చేయలేకపోతున్నానని చెప్పమనండి...పాలన ఎలా చేయాలో చంద్రబాబుగారిని నేర్పమనండి చేసి చూపించమనండి మేము రెఢీ. ఇవాళ గ్రామాల్లో షుగర్, బీపీ బిళ్లలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరిచ్చే వెయ్యి రూపాయలతో కుటుంబాన్నే నడపాలా లేక మందులే కొనుక్కోవాలో సమాధానం చెప్పండి. ఐదు వేల రూపాయలు పేదల అకౌంట్ లో వేయమంటే అధికార పార్టీ నేతలకు ఎగతాళిగా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వానికి తెలియవు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉద్దరించిన గోపాలకృష్ణ ద్వివేదీని పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టారు. ద్వివేదీ కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి , ధనుంజయ్ రెడ్డి , అజేయ కల్లాంరెడ్డి దుర్మార్గమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం రాజ్యాంగస్పూర్తికి విరుద్దంగా పనిచేశారు. మీకు హైకోర్టు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఊడినా ఆశ్చర్యం లేదు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అమరావతి కోసం పోరాడుతుంటే మీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. హైకోర్టు తీర్పులు కూడా లెక్కలేదు. గవర్నర్ కార్యాలయాన్ని చూస్తుంటే రామ్ లాల్ ఉదంతాలు గుర్తొస్తున్నాయి. పవిత్రమైన స్థలంలో గవర్నర్ కార్యాలయం పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వానికి వంత పాడటం సరికాదు. ఎన్నికలు వాయిదా వేసి ప్రజల ప్రాణాలు కాపాడిన రమేష్ కుమార్ ను పంపేందుకు గవర్నర్ కార్యాలయం ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వడం సరికాదు. కనగరాజ్ కు అరబిందోకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటికి విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలి. దుర్మార్గమైన కార్యక్రమాలను విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లోనే జగన్ జరిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి బినామీ అయిన అరబిందో ఫార్మా విశాఖ, విజయనగరం చుట్టుపక్కల వేలాది ఎకరాలను కొన్నారు. కృష్ణా , గుంటూరు జిల్లాల్లోని లంక భూముల్లో అరటి పంట పూర్తిగా పోయింది. విజయవాడ స్టేడియంలో పులివెందుల అరటిని అమ్మమని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే ఏమనాలి? మీ మంత్రులు, ఎమ్మెల్యేలు పంపించే టమాటానే కొనాలంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. 10 లక్షల టన్నుల మామిడి రాలిపోతోంది. కలెక్టర్ సహా అధికారులు పంటను కొనుగోలు చేసి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు. మంత్రులు ఇసుక తోలుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్నారు. మైలవరం , పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గంలో టన్నుల టన్నుల లారీల ఇసుకను లాక్ డౌన్ ఎత్తేశాక తరలించేందుకు సిద్ధమవుతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. అన్నీ వీడియో రికార్డింగ్ లే. చేతకాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి. పాలన ఎలా చేయాలో మేం చెప్తాం. మల్లె పంట చేలోనే రాలిపోయి రైతు 20 కోట్లు నష్టపోయాడు. రాయలసీమలో ఉద్యానపంట నేలకొరిగింది. నెల్లూరు జిల్లాలో పిడుగుపడి ఆరుగురు చనిపోయారు. ఆర్టీజీని మీరు ఎందుకు వాడుకోవడం లేదు?  మెడ్ టెక్ జోన్ చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం...మంత్రులేమో జగన్ అభివృద్ది చేశారని చెబుతున్నారు.  ధాన్యం మొత్తం కొంటామని సీఎం, కొడాలి నాని చెప్పడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గుంటూరు జిల్లా కర్ఫ్యూ నీడలో ఉంటే ప్రధానితో మాత్రం బాగా చేశానని చెబుతున్నారు. మీరుంటున్న గుంటూరు జిల్లా నుంచి బయటకు వచ్చే దిక్కులేదు. వాస్తవాలు ఇలా ఉంటే అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ పంటలను ఏ విధంగా కొనుగోలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ధాన్యం రైతులను నిలువునా దోపిడీ చేసేస్తున్నారు. క్వింటాకు 1835 రూపాయిలు రావాల్సిన బియ్యానికి మీరు ఎంత ఇస్తున్నారు? ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా లేవు. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే కన్నబాబు ఏం చేస్తున్నారు? 8వ తరగతి చదివిన కొడాలి నాని ఏం చేయగలరు? 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క డాక్టర్ ఉన్నాడా? ఆరోగ్యశాఖ మంత్రిగా ఒక్క డాక్టర్ ను పెట్టుకోలేరా ? రివ్యూలు చేయడం సీఎంకు,  ఆరోగ్యశాఖ మంత్రికి చేతకాదు. ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు...కరోనా ఉధృతమవుతుంటే ఎన్నికలు పెట్టడానికి కనగరాజ్ ని తీసుకొస్తారా ? బుద్ది ఉందా? బాధ్యత ఉందా ? మీ ప్రభుత్వానికి సలహాల కోసం అఖిలపక్షాన్ని పిలవండి.. పాలన చేతకావడం లేదు కాబట్టి చేతులెత్తేయండి ..వీడియో కాన్ఫరెన్స్ లో అఖిలపక్షాన్ని తీసుకోండి....
SD
దేవినేని ఉమామహేశ్వర రావు
మాజీ మంత్రివర్యులు


Popular posts
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర, ఏ పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు