అద్దెల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి, జనసేన పార్టీ నాయకులు డిమాండ్

అద్దెల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి, జనసేన పార్టీ నాయకులు డిమాండ్


,ఎమ్మిగనూరు,మార్చి, 2 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని గురువారం ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ఎమ్మిగనూరు తాలూకా జనసేన పార్టీ నాయకులు బి.సీ. నాగరాజు, S. భాస్కర్, K. దామోదర్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతోమనభారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సంయుక్త హెల్త్ & వెల్త్, రూరల్ & హర్బన్, హోం డిపార్ట్మెంట్స్ ప్రజా ఆరోగ్య సంక్షేమ రీత్యా, కరోనా వైరస్ నిర్మూలన రీత్యా, ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి సోకకుండా, వంటి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 20 నుండి ఏప్రిల్ 14 వరకు భారతదేశం మొత్తం  144 సెక్షన్ వంటి కఠినమైన  ఆంక్షలు విధిస్తూ అటు ప్రజల దినసరి జీవన కూలీలకు, ఇటు వర్తక వాణిజ్య పారిశ్రామిక  రంగాలకు  లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్న విషయం జగమెరిగిన సత్యం, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఇంటి అద్దె కోసం, వర్తక వాణిజ్య రంగాలకు సంబంధించిన వారిని సముదాయాల అద్దె కోసం యజమానులు, గుత్తేదారు యాజమాన్యం వేధీంచడం సరైన నిర్ణయం కాదని, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ఇంటి, వర్తక వాణిజ్య సముదాయాలకు సంబంధించిన యజమానులు అద్దెలు  చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించినా కూడా   మాకు అద్దెలు చెల్లించాల్సిందే  అని వేధిస్తున్న  వారిపై హోం శాఖ, ఇతరత్రా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని  కోరారు.
ఈ కార్యక్రమంలో నాగేంద్ర, కలగట్ల రాజు, అంజి, ప్రభాకర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు