సర్వే పల్లి రైతన్న కానుక  పంపిణీ చేస్తాం  :  ఎమ్మెల్యే. కాకాణి.    

సర్వే పల్లి రైతన్న కానుక  పంపిణీ చేస్తాం  :  ఎమ్మెల్యే. కాకాణి.                            


  సర్వే పల్లి నియోజకవర్గ పరిధిలో త్వరలో సర్వే పల్లి రైతన్నకానుక పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. గురువారం మనుబోలు మండలం జట్ల కొండూరు లో కూరగాయలు పంపిణీ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు తనపిలుపుమేరకు లాక్డౌన్ దృష్ట్యా రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులకొరకు 800 టన్నుల బియ్యం సేకరించి పంపిణీ కీ సిద్ధం చేశామన్నారు. దీంతోపాటు పామాయిల్ ఒకలీటరు చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. కూరగాయలు పంపిణీ సర్వే పల్లిలో ప్రారంభమైందని దీనిని ఆదర్శంగా తీసుకుని జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లా సాగుతుందన్నారు. ఈ కార్యాక్రమంకు సహకరిస్తున్న అన్నదాతల కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా కొండూరు పంచాయతీ లో కూరగాయలు పంపీణీ చేసిన బాస్కర్ రెడ్డికి పోలీసులు కు వైద్యులు కు మాస్క్ లు గ్లౌస్లు పంపిణీ చేసిన ఎన్ కిరణ్ రెడ్డికి అభినుదనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలవైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు