జ‌ంతువుల‌పై నిఘా :అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్) ప్రతీప్ కుమార్

జ‌ంతువుల‌పై నిఘా
విజయవాడ : జంతువులు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్) ప్రతీప్ కుమార్ సూచించారు. ఈమేర‌కు అన్ని జూల‌లోని జంతువుల్లో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. కాగా అమెరికాలో ఓ పులికి మనిషి ద్వారా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ భారత ప్రభుత్వం, కేంద్ర అటవీశాఖ.. జూల సంరక్షణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తీప్ కుమార్ సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిపై వన్యప్రాణుల విషయంలోనూ ఆలోచించాల్సిన సమయం వచ్చింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సెంట్రల్ జూ అథారిటీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని జంతు ప్రదర్శన శాలల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామ‌న్నారు. రాష్ట్రంలోని జూల‌లో ఉండే వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. జంతువులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, సీసీ కెమెరాల ద్వారా ఇరవై నాలుగు గంటలు వాటి కదలికలు పర్యవేక్షిస్తున్నామ‌ని పేర్కొన్నారు. జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వాటి రక్త నమూనాలను సేకరించి, యానిమల్ హెల్త్ ఇస్టిట్యూట్‌కు పంపి.. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందిస్తామ‌ని అధికారి తెలిపారు


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు