రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్

అమరావతి    ఏప్రిల్ 24,(అంతిమ తీర్పు):జాతీయ స్థాయిలో పది రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రులు, అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ వీడియో కాన్ఫెరెన్స్ని నిర్వహించారు. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు కరోనా విపత్తు నేపథ్యంలో గ్రామీణ పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, జీవనోపాధికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్రమంత్రి సమీక్ష.
*రాష్ట్రంలో గ్రామీణ పేదలకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక బృందాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తీసుకువచ్చిన సున్నావడ్డీ పథకం కింద వడ్డీ రాయితీలపై కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.రాష్ట్రంలోని 8.78 లక్షల పొదుపు సంఘాలకు ఏడాదికి రూ.1400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించామని, దీనివల్ల 90.37 లక్షల మంది మహిళలకు మేలు జరిగిందని వివరించిన మంత్రి పెద్దిరెడ్డి.
*రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం 13 జిల్లాల్లోని వెనుకబడిన 6 జిల్లాలకే ఏడుశాతం వడ్డీతో బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి.మిగిలిన ఏడు జిల్లాల్లో బ్యాంకుల సాధారణ వడ్డీ అంటే 13 శాతంకు పైగా వడ్డీని వసూలు చేస్తున్నాయి.
ఈ జిల్లాల్లో ఏడుశాతం కన్నా ఎక్కువ వున్న వడ్డీని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమానంగా భరించాలని నిబంధనలు వున్నాయి. దానికి సరిపడే విధంగా కేంద్రం నిధులను ఇవ్వాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


*దీనిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని గుర్తు చేసిన మంత్రి పెద్దిరెడ్డి.
 *నేషన్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) నిధుల నుంచి వడ్డీరాయితీకి నిధులను వాడుకోవాలని సూచించిన కేంద్రమంత్రి.అయితే ఎన్ఆర్ఎల్ఎం కింద రాష్ట్రానికి గరిష్టంగా ఏడాదికి సుమారు రూ.120 కోట్ల వరకు మాత్రమే అందుతున్నాయని, వడ్డీరాయితీ కోసం ఖర్చు చేస్తున్న నిధుల కన్నా ఇది చాలా తక్కువని గుర్తు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


ప్రస్తుతం ఎపిలో అమలు చేస్తున్న వడ్డీరాయితీలో ఏడు జిల్లాలకే దాదాపు అయిదు వందల కోట్ల వరకు కేటాయిస్తున్నామని వివరించిన మంత్రి పెద్దిరెడ్డి.


రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు వడ్డీరాయితీ వల్ల ఆర్థిక చేయూత లభిస్తుందని, దానికి కేంద్రం నుంచి కూడా సహాయం అందించాలని విజ్ఞప్తి.*


దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రంమంత్రి, కేంద్రప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ.


 *రాష్ట్రంలో కరోనా విపత్తు నేపథ్యంలో స్వయం సహాయక బృందాలతో 16 కోట్ల మాస్క్ లు తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


దానితో పాటు శానిటైజర్లు, పిపిఐ కిట్ లను కూడా తయారు చేయిస్తున్నాం.


 రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 58 లక్షల మందికి నెలకు 1395.79 కోట్లను పంపిణీ చేశాం. 


 దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్లకు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ మొత్తాలను పంపి, స్వయంగా వారి చేతికి అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అర్హులైన పేదలకు వెయ్యి రూపాయల సాయం కింద ఈ నెల నాలుగో తేదీన రూ.1343 కోట్ల రూపాయలను అందించింది. 
వైఎస్ఆర్ బీమా పథకం కింద కరోనా సమయంలోనూ 5545 మందిని రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 37 కోట్ల రూపాయలను బీమా మొత్తంగా చెల్లించడం జరిగింది.


)లాక్ డౌన్ సమయంలో స్త్రీనిధి రుణాల కింద సభ్యులు చెల్లించాల్సిన రూ.350 కోట్లకు రాష్ట్రప్రభుత్వం మారటోరియం ప్రకటించింది.  కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను, సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లకు తెలియచేయడం ద్వారా వాటిని పూర్తిగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోంది. 
   ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అందుకు అవసరమైన అన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల రక్షణ కోసం ప్రతి వ్యక్తికి మూడు మాస్క్ లను ఉచితంగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మాస్క్ ల తయారీ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. లాక్ డౌన్ సమయంలో ఉపాధికి దూరమైన స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పనులతో అటు ఉపాధిని కల్పించడంతో పాటు ఇటు ప్రజల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే మాస్క్ లను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు యాబై లక్షల మాస్క్ లను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. 
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయించిన మొత్తం పనుల్లో 62శాతం వ్యక్తిగత పనులుకు నిధులను కేటాయిస్తున్నాం. ఇప్పటి వరకు 77 శాతం నిధులను సహజ వనరుల నిర్వహణ (ఎన్ఆర్ఎం) పనులకు ఖర్చు చేశాం.  మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపడుతున్న కూలీల బృందాలకు కరోనా విపత్తు నేపథ్యంలో చేతులను ఎక్కువసార్లు శుభ్రపరుచుకునేందుకు రెండు సబ్బులు, డెటాల్ లిక్విడ్ లను అందచేస్తున్నాం. ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలను పాటించడం, వాటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ను రూపొందించాం. పనులు జరిగే ప్రాంతం నుంచి జియో కోఆర్డినేషన్ తో ఫోటోలను కూడా ఈ యాప్ లో అప్ లోడ్ జరిగేలా ఆదేశించాం. ఎక్కడా కరోనా నియంత్రణ నిబంధనల ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షిస్తున్నాం.ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఈ నెల 21వ తేదీ వరకు చెల్లించాలసిన వేతనాలను అందచేశాం. అలాగే పెండింగ్ లో వున్న వేతన బకాయిల బిల్లులను కూడా ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.కేంద్రప్రభుత్వం కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు నిర్ధేశించిన అన్ని నిబంధనలను రాష్ట్రప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తోంది. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు జీవనోపాధి కల్పించడంపై కూడా దృష్టి సారించింది.పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమార్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు తదితరులు పాల్గొన్నారు


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image