ఆర్.డి.టి. సహకారంతో నెల్లూరు జర్నలిస్ట్ లకు నిత్యావసర వస్తువులు : జాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి
నెల్లూరు :   ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు) :  కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు సాయం చేయాలని కోరుతూ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందజేయాలని రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు (RDT) అనంతపురం వారిని జాప్ కోరగా, వారు నెల్లూరు నగరంలో ఉన్న ఆ శాఖ ద్వారాఅందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతులు ఇప్పించి, సిఫార్సు చేయించాలని కోరగా,  ఆ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ను బుధవారం కలెక్టర్ క్యాపు ఆఫీసులో కలవడం జరిగింది. కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందించి, ఈ తంతు పూర్తి చేయాలని డి ఆర్ ఓ ను ఆదేశించారు. డి ఆర్ ఓ ను కూడా కలిసి కలెక్టర్ సిఫారసు లేఖను అందజేయగా ఆయన వెంటనే స్పందించి ఆర్ డి టి సంస్థ తో సంప్రదింపులు జరపడంతో పాటు, సమాచారశాఖ ద్వారా జాబితా కోరారు. జిల్లా జాప్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, జాప్ నాయకులు విజయకుమార్ రెడ్డి,రావూరి రమేష్ పాల్గొన్నారు.