ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు భయభ్రాంతులకు గురిచేయద్దు : వర్ల రామయ్య 

వర్ల రామయ్య విలేకరుల సమావేశ వివరాలు.


10-4-2020. 
ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు భయభ్రాంతులకు గురిచేయద్దు : వర్ల రామయ్య 
                  ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న డాక్టర్ల సస్పెన్షన్ ను తొలగించాలి 
కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్ కు రక్షణ పరికరాలు కల్పించాలి  
ఆయుధాలు లేకుండా కరోనాపై యుద్ధమంటే ఆశామాషీ కాదని జగన్ తెలుసుకోవాలి 
మెడికేషన్ మాస్కులు, రక్షణ గౌనులు, గ్లౌజెస్ సరఫరా చేసి వైద్యులకు మనోధైర్యం కలిగించండి   
దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతునాయి?
సాక్షికి కోట్లలో దోచిపెట్టడానికి ఇస్తున్న  ప్రకటనలు ఆపుచేయండి 
అధికార్లు చెప్పింది వినకుండా ప్రజల్లోకి వచ్చి జగన్ వాస్తవాలు తెలుసుకోండి   
వైకాపా ప్రభుత్వం ఆసుపత్రుల్లో కరోనా కట్టడికి సమకూర్చాల్సిన సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పిన ఉద్యోగులను సస్పెండ్ చేసే కార్యక్రమం కొనసాగిస్తుండటం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.  "అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్లు" ఉందీ సీఎం జగన్ పరిస్థితి అని వర్ల  ఎద్దేవా చేశారు..  ఇక్కడ జగన్  తప్పులు దిద్దుకోవడం లేదు చిన్న తప్పులు చేసిన వారిని శిక్షించడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు . ``కరోనా మహమ్మారిని ఆయా రాష్ట్రాలు, దేశాల నుంచి పారద్రోలాలని  నేతలంతా ప్రయత్నిస్తున్నారు..ఏపీలో మాత్రం కరోనాను పారదోలే  ప్రక్రియలో పాల్గొనే డాక్టర్లు,మెడికల్, శానిటరీ సిబ్బంది, ఎగ్జిక్యూటీవ్స్ పోలీసులు, రెవిన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు, పదోన్నతలు, ఇంక్రిమెంట్లు, బోనస్ లు ఇచ్చి  బాధ్యతలను గుర్తు చేయడానికి బదులు ఏపీలో సస్పెన్షన్లకు గురి చేస్తున్నారు. అయినదానికీ కానిదానికీ ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తు భయభ్రాంతులను చేస్తున్నారు.  కరోనాపై సీఎంకు పూర్తి అవగాహన ఉన్నట్లు కనపడటం లేదు.  కరోనా కట్టడిలో ఉత్తేజపరచి కార్యోన్ముఖులను చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టరు సుధాకర్ కరోనా మహమ్మారి తీవ్రత చెప్పారు. విదేశాల్లోనూ కరోనాకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా చనిపోయిన దాఖలాలున్నాయి. మాస్కులు,ప్రొటెక్టీవ్ కిట్స్ ఇవ్వమని అడగడం తప్పా.కరోనాపై యుద్ధం చేయడానికి కావాల్సిన ఆయుధాలు మెడికేషన్ మాస్కులు, రక్షణ గౌనులు, గ్లౌజెస్  అడిగినందుకు నర్సీపట్నంలో డాక్టరును   సస్పెండ్ చేశారు. ఈ సమయంలో ఎవరైనా చేస్తారా.  ఆ ఎనస్తీషియన్ స్థానంలో ఎవరినైనా నియమించారా? ఆ ఖాళీ భర్తీ చేయకుండా కక్ష తీర్చుకోవడంతో వైద్య బృందాలన్నీ ఉలిక్కిపడ్డాయి. నగరి కమిషనర్ వెంకటరామిరెడ్డి ట్రెజరీ సీజ్ చేశారని, తట్ట బ్లీచింగ్ వేయడానికి  నిధులు మంజూరు చేయలేదన్నందుకు సస్పెండ్ చేశారు. "అమ్మ ఇవ్వదూ అడుక్కుతిననివ్వదు"అన్నట్లుగా ఉందీ వైకాపా ప్రభుత్వ తీరు. అనంతలో జూడాలు వైద్యం చేయలేమని అంటుంటే సిగ్గుతో ప్రభుత్వం తలదించుకోవాలి. 151 సీట్లు ఇచ్చి ప్రజలు ముఖ్యమంత్రిని చేసినందుకా ఈ శిక్ష. ఎప్పుడు ఎవరు సస్పెండ్ అవుతారోనని డాక్టర్లు భయపడుతున్నారు.  డాక్టర్లంతా అభద్రతా భావంలో ఉన్నారు. సొంత పత్రిక సాక్షికి ఏభయికోట్లు ప్రకటనలకివ్వడానికి డబ్బులెలా వచ్చాయి. డాక్టర్లకు సర్జికల్  మాస్క్ లు ఇవ్వడానికి దాతలిచ్చిన  కోట్లాది విరాళాలు ఏమయ్యాయి. కోటి మాస్కులు కొని డాక్టర్లకు సరఫరా చేయండి. జగన్ ఇల్లు కదలకుండా సాక్షి 
పత్రికకు ప్రకటనలు ఇస్తూ కూర్చున్నారు. ఇలా.అయితే కరోనా నుంచి ప్రజలను రక్షించడం కష్టం.  ప్రభుత్వ తప్పులను ఎంచిన ప్రతిపక్షనేతలను  నోటికొచ్చినట్లు తిట్టడం సబబు కాదు. నెల్లూరు ఎమ్మెల్యే.ప్రసన్న కుమార్ రెడ్డి సిగ్గుమాలిన బూతులు తిట్టడం సభ్యతగా లేదు.  చంద్రబాబును తిడుతుంటే     జగన్ నవ్వుకుంటారు . జగన్ నుంచే స్క్రిఫ్ట్ వెళుతోంది. సీఎంవో నుంచే వెళుతోంది.. ప్రసన్న కుమార్ రెడ్డి మనిషా.ఆయన తల్లిగారు జోక్యం చేసుకుని కుమారుడికి బుద్ధి చెప్పాలి. అతని తండ్రి వయసున్న నాయకుడుని ఇష్టానుసారం తిడుతుంటే ఊరుకుంటారా. ఫెనాయిల్, మాస్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా.. సైన్యానికి తిండి తిప్పలూ లేకపోవడంతో హిట్లర్  పై అతని సైన్యం తిరుగుబాటు చేసింది . కరోనాపై యుద్ధం చేయడానికి ఆయుధాలు ఇవ్వకుండా  డాక్టర్లు ఎలా పోరాటం చేస్తారు. జగన్ బయటకు రారు. రైతు బజారుకు వచ్చి పరిశీలించండి.  ఇతర రాష్ట్రాల సీఎంలు జగన్ తీరు చూస్తే నవ్వుతారు. ప్రీ రికార్డు చేసి పాత్రికేయులను ఎదుర్కోలేక రికార్డు పంపిస్తారా? జగన్ దాక్కుంటున్నాడు. పాత్రికేయులతో మాట్లాడి ప్రభుత్వం ఏంచేయాలో చెప్పమని కోరాలి. పారాసిటమాల్ అంటే ప్రపంచమంతా నవ్వారు.  నష్టపోయేది రాష్ట్రప్రజలు మహారాష్ట్ర అందరికీ  రక్షణ కిట్స్ ఇచ్చారు. పోలీసులకు భోజనం ఇచ్చిన దాఖలాలు లేవు. నియంతలనుకున్న హిట్లర్, ముస్సోరిలు మట్టికొట్టుకుపోయారు. ప్రభుత్వ విధానంపై నోరెత్తితే సస్పేండ్ చేయడమేమిటి కరోనా  వ్యాధి సోకి డాక్టరుపోతే మరో డాక్టరు ను  తేలేరు.. జగన్ కక్ష కార్పణ్యాలతో  ఫ్యాక్షనిస్టు పాలన సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలించకుండా అడ్డుపడుతున్నారు. ఎస్ ఈ సీ రమేష్ కుమార్ కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను  కాపాడారని ఇగో హర్ట్ అయి జగన్ పగబట్టారు.  రమేష్ కుమార్ ను తీసేయడం న్యాయమా, ధర్మమా .    తొలగించాలని  ఆర్డినెన్స్ జీవో సిద్ధం చేస్తారా. మంచి చేసిన వారిని తొలగిస్తారా. రమేష్ మంచి చేశారని వైకాపా నేతలు సైతం అంటున్నారు.   ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ. 77 వేల కోట్లు ఏమయ్యాయి..బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం పట్టించుకోరా? ఏ2 డాక్టర్లకు ఇవ్వల్సిన ఎన్ 95 మాస్క్ తగిలించుకుని తిరుగుతున్నాడు. విజయవాడ లో  జగన్  తిరిగి ప్రజలకు నమ్మకం కలిగిచాలి. సుధాకర్ సస్పెషన్, నగరి కమిషనర్ ల   సస్పెన్షన్లను రద్దు చేయండి. అదిగోపులి ఇదిగో తోక అని అధికార్లు అనకుండా వాస్తవాలు చెప్పాలి. జగన్  ప్రాథమిక హక్కును నలిపేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతతో బ్ఫ్రంట్ వారియర్స్ ముఖ్యంగా డాక్టర్లుకు  అన్నీ సమకూర్చాలి. వైద్య ఆరోగ్యశాఖతో మాట్లాడి కిట్స్ ఇవ్వండి. డాక్టర్లకు కరోనా సోకే ప్రమాదం నుంచి కాపాడండి.జూడాల ఆవేదన వింటుంటే కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతున్నాయి.  ప్రస్తుత మన శత్రువు కరోనాను తుదముట్టించడానికి అహంభావం పక్కనపెట్టండి.  ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సరిదిద్ఫుకోవాలి. సాక్షికి.ప్రకటనలకు కోట్లు ఖర్చు చేయకుండా కరోనా కట్టడికి నిధులు సమకూర్చండి. ప్రజారోగ్యానికు ముప్పు కలిగించకుండా డాక్టర్లకు మనోధైర్యం కలిగించండి.