భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటిద్దాం :మండ్ల సురేష్ బాబు,

మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటిద్దాం


*చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,


*జల వనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పిలుపుతో శానిటేషన్ కు శ్రీకారం*



*చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 6 వ రోజు శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోటరి అధ్యక్షులు ధశరద రామిరెడ్డి జన విజాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద.


*మన భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటించి మన జీవితాలను మనమే కాపదుకుంధామని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైయస్ అర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ లు అన్నారు.చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 7వ రోజు శానిటేషన్ కార్యక్రమాన్ని గురువారం గూడూరు పట్టణం లోని సొసైటీ నారాయణమ్మ దేవస్థానం వద్ద నుంచి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవత స్వచ్చంధ సంస్థ అధ్యక్షులు,రోటరీ క్లబ్ ప్రతినిధులు దశరథరామిరెడ్డి,జనవిజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా శానిటేషన్ వాహనాన్ని ప్రారంభించారు. చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,జన విజాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్‍ మాట్లాడుతు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా శానిటేషన్ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోందన్నారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పొలుబోయిన అనీల్ కుమార్ యాదవ్,వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఎన్నో విపత్కర పరిస్థితులను భారత దేశ ప్రజలు ఎదుర్కొన్నారన్నారు.దేశంలో కలరా,ప్లేగు,ఇతర ఎన్నో ప్రమాద కర వ్యాధులను తట్టుకుని నిలబదిందన్నారు.కరోనా ను కూడా కలిసికట్టుగా నిలబడి తరిమికొడదమన్నారు.గూడూరులో కరోనా పాజిటివ్ కేసు రావడం దురదృష్టకరమన్నారు.కరోనా దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తుంది అని అన్నారు.ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని లేకుంటే కరోనా వైరస్ బారిన పడక తప్పదని అన్నారు.చేగువేరా ఫౌండేషన్ పట్టణ ప్రజలకు అండగా నిలవడం విశేషం అన్నారు.దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ కష్ట కాలంలో స్వచ్చంధ సంస్థలు ప్రజలకు అండగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్,మధు రెడ్డి,నరేష్  రెడ్డి,అన్సర్ భాష,వినోద్,చేగువేరా పైలట్ టీమ్ పాల్గొన్నారు.*


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు