వలస కార్మికులకు ఆహారం

ప్రపంచములో విలువైనది, వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే  అది మన సమయం (టైం). మనము ఇతరులకు కూడా ఇవ్వగలిగిన విలువైనది ఏదైనా ఉందంటే అదీ సమయమే. కోల్పోయిన డబ్బు, ఆస్తి ఇంకా ఏమైనా... మరల సంపాదించవచ్చు, కానీ కరిగిపోయిన ఈ క్షణాలు మళ్ళి  తిరిగిరావు అనేది జగమెరిగిన సత్యం.  వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయినా షేక్ ఇర్ఫాన్, తనకున్న విలువైన సమయాన్ని నిస్సహాయలతో, నిరాశ్రయులతో గడపటం తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా అవకాశాన్ని వెతుక్కొని మరీ అభాగ్యులకు తోడ్పడుతుంటాడు. హెల్పింగ్ హాండ్స్ అనే పేరు మీద నెల్లూరు లో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వతిస్తున్నారు. సర్వాంతర్యామి అయినా ఆ భగవంతుడిని  ఎప్పుడు చూడలేదుకాని మానవ రూపంలో వున్న ప్రతిమనిషి దేవుడే అని గట్టిగా నమ్మే సైద్ధాంతికుడు. కనిపించని దేవుడికి ఇచ్చే అర్పణలకన్నా,  నిస్సహాయ స్థితిలో వున్న నిర్భాగ్యులకు సేవ చేయటం మాధవ సేవయే అని రూఢిగా నమ్మే మానవతావాది.  ఎవరో వస్తారని... ఏదో చేస్తారని.... ఎదురుచూడడంకన్నా.. మనకు మనమే ఉద్దరించుకోవాలని  నాలుగు దశాబ్దాలక్రితం  శ్రీ శ్రీ  గారు వ్రాసిన మాటలు ఇలాంటివారి చేతల ద్వారా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.  లాక్ డౌన్ సమయంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపకులు చేస్తున్న హెల్ప్ ది నీడి (Help The Needy) కార్యక్రమములో ఈ రోజు పాలుపంచుకొని తన వంతు సాయంగా కొండాయపాలెం ఊరు వెలుపల వున్న వలస కార్మికులకు భోజనం పెట్టారు. 
ధన్యవాదాలు 
డా. ఉదయ్ అల్లం


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు