జాగ్రత్త వహించకపోతే ప్రజలకు తీవ్ర నష్టం :గూడూరు పట్టణ సీఐ దశరథ రామారావు

*కరోనా ఎంతో దూరంలో లేదు*


*జాగ్రత్త వహించకపోతే ప్రజలకు తీవ్ర నష్టం*


*గూడూరు పట్టణ సీఐ దశరథ రామారావు*


*చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పు గూడూరులో శానిటేషన్*


*ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,సీఐ దశరథ రామారావు,ఎస్ఐ బ్రహ్మనాయుడు లు చేతుల మీదుగా శానిటేషన్ కార్యక్రమం ప్రారంభం*


*కరోనా వైరస్ గూడూరు పట్టణానికి కూడా రావడం దురదృష్టకరమని కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి స్వచ్చంధ సంస్థలు,ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి నా ఒకరిద్దరు చేసిన పొరపాటుకు గూడూరు కు కూడా వ్యాధి వ్యాపించడం జరిగిందన్నారు.ఇప్పటి కైన నష్టం ఏమి లేదని దయచేసి ప్రజలు బయటకు అడుగు పెట్టవద్దని సీఐ దశరథ రామారావు అన్నారు.గూడూరు పట్టణంలో నీ తూర్పు గూడూరులో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.తూర్పు వీధి,పూల తోట గిరిజన కాలనీ,శివాలయం వీధి,పోలీస్ కొర్టస్ ప్రాంతాల్లో శానిటేషన్ నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ దశరథ రామారావు,ఎస్ ఐ  బ్రహ్మనాయుడు లు పాల్గొని శానిటేషన్ వాహనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చేగువేరా ఫౌండేషన్ ప్రజల ఆరోగ్యము కాపాడేందుకు తనవంతు కృషి చేస్తుందన్నారు.ఎస్ ఐ మాట్లాడుతూ అధికార యంత్రాంగం తో సమానంగా స్వచ్చంధ సంస్థలు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.అందులో చేగువేరా ఫౌండేషన్ మందు వరుసలో ఉందన్నారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో పోలీసు,రెవెన్యూ,పారిశుధ్య,మునిసిపల్,పత్రికా సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు.ఈ కార్య క్రమంలో ఫౌండేన్ అధ్యక్షులు గుండాల అది నారాయణ,క్రాంతి కుమార్,మధు రెడ్డి, అన్సర్ భాష,నరేష్ రెడ్డి,పైలట్ టీం వినోద్,పవన్,భాస్కర్,అజయ్,సంతన్, సాయి మహేష్,లక్ష్మి నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.*