వైయస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్‌ ఉపయోగాలు

*08–04–2020*
*అమరావతి.*


*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ నిర్మాణ్, ఏపి ఇండస్ట్రీస్‌ కోవిడ్‌ –19 రెస్పాన్స్‌ పోర్టల్స్‌ను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*వైయస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్‌ ఉపయోగాలు* 


పోలవరంతో నిర్మాణపనులు, ప్రభుత్వ గృహనిర్మాణంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ  పరిమాణంలో సిమెంటు కావాలో ఈ వైయస్సార్‌ నిర్మాణ్‌ యాప్‌ ద్వారా ఇండెంట్ చేసుకునే వెసులుబాటు.


వివిధ సిమెంటు తయారీ కంపెనీలు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు నడుమ సమన్వయం చేయడమే ఈ యాప్‌ లక్ష్యం. తద్వారా వివిధ పనులు ఆలస్యం కాకుండా ముందుకు సాగడానికి ఆస్కారం మరియు ప్రభుత్వ ధనం ఆదా.


సీఎఫ్‌ఎంఎస్‌కు వైయస్సార్‌ నిర్మాణ్‌ పోర్టల్‌ను అనుసంధానం చేయడం వల్ల సరఫరాదార్లకు ఎలాంటి ఆలస్యం లేకుండానే ఆన్‌లైన్‌ ద్వారా వారి పేమెంట్స్‌ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 


*ఏపి ఇండస్ట్రీస్‌ కోవిడ్‌ –19 రెస్పాన్స్‌ పోర్టల్‌*
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ కంపెనీలు, సరఫరాదారులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదుచేసుకోవాలి. 


కోవిడ్‌ –19 మెడికల్‌ రిలేటెడ్‌ ఐటెంలు, మాస్క్‌లు, శానిటైజర్స్, బెడ్స్, బెడ్‌ రోల్స్‌ వంటి వైద్య పరమైన సామాగ్రి అమ్మేవారు, కొనేవాళ్లు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. 
దీని వల్ల ఎవరి దగ్గరి ఎలాంటి వైద్యపరమైన మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులున్నాయన్న వివరాలతోపాటు అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి వచ్చే వెసులుబాటు. 
ఇది డెస్క్‌టాప్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా అందరూ వాడుకోవచ్చు. అవసరమైన సామగ్రి కొనుగోలు చేయుటకు సౌలభ్యంగా ఉంటుంది.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు