భరతమాత సేవలో బి.జే. పి.నాయకులు వై.వి.సుబ్బారావు

భరతమాత సేవలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ - జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు  ఏప్రిల్ 06, 2020 అమరావతి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గుంటూరులో బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు గారి నివాసం వద్ద బిజెపి జెండాను స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎగురవేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1952 సంవత్సరంలో జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి అధ్యక్షతన ఏర్పాటైన జనసంఘ్ పార్టీ 06 ఏప్రిల్ 1980 సంవత్సరంలో శ్రీ అటల్ బిహారీ వాజపేయి జీ, లాలకృష్ణ అడ్వాణీ గారి సారధ్యంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుందని జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు తెలిపారు. అనంతరం తొలి అధ్యక్షునిగా అటల్ బిహారీ వాజపేయి గారు బాధ్యతలు స్వీకరించారని, జనసంఘ్ పార్టీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ  స్థాపించిన తర్వాత కొద్ది కాలానికి దీన దయళ్ ఉపాధ్యాయ గారు తోడై పార్టీ సిద్ధాంతాలైన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ ప్రతిజ్ఞతో పనిచేసి పార్టీకి జీవం పోశారని తెలిపారు. చివరికి వారి ప్రాణాలను సైతం దేశం కోసం, పార్టీ సేవలో అర్పించారని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం1984 సంవత్సరంలో  కేవలం 2 సీట్లతో మొదలై దినదినాభివృద్ధి చెందుతూ 2019 ఎన్నికల్లో శ్రీ నరేంద్ర మోదీ, అమిత్ షా గారి సారధ్యంలో 303 చేరుకొందని తెలిపారు. దాదాపు 18 కోట్ల పైగా అత్యధిక సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని, భారతీయ జనతా పార్టీలోని ప్రతీ కార్యకర్త "భారత్ మాతా కీ జై" అనే నినాదంతో ఏకతాటిపై నడిచి జీవితాంతం పార్టీకి సేవ చేయడం పార్టీ సైద్ధాంతిక క్రమశిక్షణకు నిదర్శనం అని అన్నారు. భారతీయ జనతా పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు ప్రతీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేసారు.  ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలో ప్రపంచంలోని దిగ్గజ దేశాలు సైతం కరోనా వైరస్ దాడికి అతలాకుతలం అవుతున్న వేల, ప్రపంచ దేశాల అగ్రనాయకత్వం సైతం ఆశ్చర్య పోయేలా మన దేశాన్ని కరోనా నుండి రక్షిస్తూ మనందరిని ముందుడి నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్రమోదీ లాంటి పటిష్టమైన నాయకున్ని దేశానికి అందించిన ఘనత ఒక భారతీయ జనతాపార్టీకి మాత్రమే చెందుతుందని అన్నారు. భారతీయ జనతాపార్టీ మనదేశానికి నిరంతరం ప్రజాసేవ కోసం తరించే ఎంతోమంది దేశభక్తులను అందించి మన దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతోందని అన్నారు. తన మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో అప్రతిహాసంగా మరో ముప్పై సంవత్సరాల వరకు కూడా తమ పాలనను కొనసాగిస్తుందని జోస్యం చెప్పారు. కరోనా వైరస్ మీద దాడిలో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయసహకారాలను అందిస్తూనే, వారందరికీ సంఘీభావంగా దేశంలోని భారతీయ జనతాపార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు మొత్తం ఉపవాస దీక్షను చేపడతారని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా జాతీయ పార్టీ ఆదేశానుసారం PM CARES ఫండ్ కు తమ వంతు సహాయాన్ని అందించాలని బిజెపి జిల్లా కార్యదర్శి  వై.వి.సుబ్బారావు కోరారు. (వై.వి.సుబ్బారావు)


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image