జర్నలిస్ట్ ల ను ఆదుకోండి  :గంట్ల శ్రీనుబాబు

జర్నలిస్ట్ ల ను ఆదుకోండి 
పలువురికి  నిత్యావసర వస్తువులు  పంపిణీ
ప్రత్యేక వేతనం మంజూరు చేయాలని వినతి 
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు
విశాఖపట్నం... సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆధుకోవాలి అని ఇదే సమయం లో తాము కూడా   అండగా ఉంటామని.. వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు...  బుధవారం ఇక్కడ బాలయ్య శాస్త్రి లేఔట్ లో పలువురు జర్నలిస్టులకు.. ఉప సంపాదకులకు.,చిన్న పత్రికల సంపాదకులు కు  తాను సొంతంగా సమకూర్చిన నిత్యవసర వస్తువులను శ్రీనుబాబు చేతులు మీదుగా  అందజేశారు.,, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు తన వంతు చేయూతను  అందించాలని భావించానన్నారు... ఇప్పటి వరకూ తన సొంత నిధులతోనే నాలుగు  విడతలుగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు అందజేశామన్నారు,.. .. ఇప్పటివరకూ 406మందికి , తాను సాయం అందించడం జరిగిందన్నారు,.. ఈ కార్యక్రమంలో గంట్ల హర్షవర్ధన్... పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు