మంత్రి శ్రీను  సేకరించిన విరాళాలను బహిరంగపరిచి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలి : పోతిన వెంకట మహేష్

వార్డు వాలంటీర్ అడ్మిన్తో పాటు స్థానిక వైసిపి నాయకత్వాన్ని కూడా కరోనా టెస్టులు చేయాలి.


వైయస్ విజయమ్మ  మానవత్వంతో రాజధాని అమరావతి పై స్పందించి అమరావతిని రాజధానిగా కొనసాగాలని వారి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సూచించాలి


మంత్రి శ్రీను  సేకరించిన విరాళాలను బహిరంగపరిచి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలి.


లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 53వ డివిజన్ స్థానిక వైసీపీ అభ్యర్థి పై పోలీస్ కేసు నమోదు చేసినందున అనర్హుడిగా ప్రకటించాలి


విజయవాడ వన్ టౌన్ గణపతి రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ విజయవాడ వన్ టౌన్లో కరోనా పాజిటివ్ కేసు కింద నమోదైన వార్డు వాలంటీర్ అడ్మిన్ కు ఎటువంటి మెడికల్ డ్రెస్ వేయకుండానే తరలించడం ప్రజలను తీవ్ర ఆందోళనకు, భయభ్రాంతులకు గురి చేసిందని, ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు తరలించ లేదని, సాధారణ పౌరులు అయితే మెడికల్ డ్రెస్ వేసి అధికారులు పోలీసు శాఖ వారు హడావిడి చేసే వారని, వార్డు వాలంటీర్ కనుకనే ప్రజా ఆరోగ్య భద్రత ని గాలికొదిలేసి మెడికల్ డ్రెస్ వేయకుండానే క్వారంటైన్కు తీసుకెళ్లారని, అదేవిధంగా వాలంటీర్ అడ్మిన్ శుక్రవారం సాయంత్రం వరకు వీధుల్లోనే ఉన్నారని వారు  వాలంటీర్ల తో విధులు నిర్వహించారో రేషన్  ఎక్కడ అందజేశారో, స్థానిక వైసిపి నాయకత్వంతో ఎక్కడ కలిసి పనిచేశారో వారందరికీ తప్పనిసరిగా కరోనా  టెస్ట్ చేయాలని తద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించాలని అధికారులను కోరారు. వార్డు వాలంటరీ అడ్మిన్నువ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎందుకు చూడలేదని కరోనా పాజిటివ్ అని తెలిసిన కూడా విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు గానీ, కలెక్టర్ గారు గానీ, నగర పోలీస్ కమిషనర్ గారు గానీ స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. వాలంటీర్ల తో కలిసి  స్థానిక వైసిపి నాయకత్వం ప్రజల దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరికీ  వార్డు వాలంటీర్లతో పాటు స్థానిక వైసిపి నాయకులు కూడా కరోనా టేస్ట్ లు చేయాలని డిమాండ్ చేశారు.


వైయస్ విజయమ్మ గారు మానవత్వంతో 200 మంది పురోహితుల పట్ల స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే రాజధాని ప్రాంతంలో మహిళలు, రైతులు 4 నెలలుగా చేస్తున్న ఉద్యమం పట్ల కూడా మానవత్వంతో స్పందించి రాజధాని అమరావతి లోనే కొనసాగే విధంగా వారి కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయాలని మహేష్ కోరారు.


స్థానిక 53 డివిజన్లో వైసీపీ అభ్యర్థి  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వివాహ వార్షికోత్సవ వేడుకలను రోడ్లపై నిర్వహించినందుకు పోలీస్ శాఖ కేసులు నమోదు చేశారని, దీనికి మంత్రి శీను గారు నైతిక బాధ్యత వహిస్తూ స్థానిక అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని మహేష్ డిమాండ్ చేశారు.


మంత్రి  శ్రీను గారు కరోనాను కూడా వదల్లేదని కరోనాను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తూ విరాళాలు సేకరించి తానేదో ప్రజలకి కూరగాయలు పంచినట్లు ఉచిత బిల్డప్ ఇస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని సేకరించిన విరాళాలు మొత్తాన్ని బహిరంగ పరచి మిగిలిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని  డిమాండ్ చేశారు . రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తుంటే ఉంటే మంత్రి శీను గారు మాత్రం సేకరించిన విరాళాలను తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని మహేష్ అన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..