ప్రభుత్వ సాయం ప్రతి గిరిజన కుటుంబానికీ అందాలి

ప్రభుత్వ సాయం ప్రతి గిరిజన కుటుంబానికీ అందాలి
• రేషన్, పింఛన్, రూ.1000 వందశాతం పంపిణీ చేయాలి
• అంగన్ వాడీల పోషకాహార పంపిణీని సమీక్షించాలి
• గిరిశిఖర గ్రామాలన్నింటికీ ప్రభుత్వ సాయం చేరాలి
• ఐటీడీఏలకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం
• పిఓలతో పుష్ప శ్రీవాణి టెలి కాన్ఫరెన్స్ 
అమరావతి, ఏప్రిల్ 6:- ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, రూ.1000 ఆర్థిక సహాయాలతో పాటుగా అంగన్ వాడీ కేంద్రాల నుంచి ఇళ్లకు చేర్చాల్సిన పోషకాహారం ను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గిరిజన కుటుంబానికీ చేర్చేలా చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఐటీడీఏ పిఓలను కోరారు. కరోనా వైరస్ గిరిజన ప్రాంతాలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహించడం ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఐటీడీఏల పరిధిలో రేషన్, ఆర్థిక సహాయాల పంపిణీలతో పాటుగా కరోనా క్వారంటైన్, సోషియల్ డిస్టెన్స్ అమలుపై సోమవారం ఐటీడీఏ పిఓలతో టెలీకాన్ఫరెన్స్ లో డిప్యుటీ సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగానే పార్వతీపురం. సీతంపేట, పాడేరు, కేఆర్ పురం, చింతూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల పిఓలతో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గిరిశిఖర గ్రామాలు, రహదారులు లేని గిరిజన గ్రామాలకు రేషన్ ఇంకా అందలేదనే ఫిర్యాదులు ఉన్నాయని, అలాంటి ప్రాంతాలకు కూడా రేషన్ ను చేర్చాలని ఆదేశించారు. అవసరమైన చోట జీసీసీకి చెందిన వాహనాలను కూడా రేషన్ సరఫరాకు  వినియోగించుకోవాలని, నేరుగా గిరిజనుల ఇళ్ల వద్దకే రేషన్ ను చేర్చాలని, 100శాతం రేషన్ పంపిణీ జరగాలని స్పష్టం చేసారు. ఈ అంశంపై పిఓలు తమ ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి సంబంధించిన విషయాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ముంపు ప్రాంతమైన చింతూరు ఐటీడీఏ పరిధిలో కొన్ని గిరిశిఖర గ్రామాలతో పాటుగా బోటులో మాత్రమే వెళ్లగలిగే గ్రామాలు కూడా ఉన్నాయని, అలాంటి గ్రామాలకు ఐటీడీఏ ద్వారా బోటులో రేషన్ సరఫరా చేసామని, గిరిశిఖర గ్రామాలకు వాలంటీర్లతో పాటుగా స్వచ్ఛంధ సంస్థలతో కలిపి గిరిజనుల ఇళ్ల వద్దకే రేషన్ చేర్చామని చింతూరు ఐటీడీఏ పిఓ తెలిపారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో ప్రతి రేషన్ షాపుకు ఒక సచివాలయ ఉద్యోగిని ఇంచార్జ్ గా నియమించామని, మండలానికి ఒక స్పెషలాఫీసర్ ను పెట్టి రేషన్ పంపిణీ పటిష్టంగా చేసామని పాడేరు ఐటీడీఏ పిఓ వివరించారు. రేషన్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు కూడా బియ్యాన్ని అందించామని ఈ సందర్భంగా పలువురు పిఓలు చెప్పారు. నెల్లూరు యానాది ఐటీడీఏ పరిధిలో సంచారజాతికి చెందిన 900 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోయినా పౌరసరఫరాల శాఖ ద్వారా ఉచిత రేషన్ ను పంపిణీ చేసామని నెల్లూరు పిఓ వెల్లడించారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కొన్ని మారుమూల గిరిజన గ్రామాలకు రేషన్ తో పాటుగా కూరగాయలను, పచ్చళ్లను  కూడా పంపిణీ చేసామని శ్రీశైలం పిఓ తెలిపారు. అలాగే తమ ప్రాంతాల్లో రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ ఇప్పటికే సగటుప80 శాతానికి పైగా పూర్తయిందని మిగిలిన 20 శాతం పంపిణీని  మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని పిఓలు చెప్పారు. దీంతో పాటుగా పింఛన్ల పంపిణీ 90 శాతానికి పైగా పూర్తయిందని స్థానికంగా అందుబాటులో లేని లబ్దిదారులు మినహా మిగిలిన వారందరికీ పెన్షన్ పంపిణీ పూర్తి చేసామని కూడా పిఓలు వివరించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో పింఛన్ల పంపిణీ 100శాతం పూర్తయిందని పిఓ తెలిపారు.ఈ విషయాలపై పుష్ప శ్రీవాణి స్పందిస్తూ, ఇప్పటి వరకూ రేషన్, పింఛన్, రూ.వెయ్య ఆర్థిక సాయం పంపిణీ ఎంత శాతం జరిగిందనే విషయాన్ని సమీక్షించడంతో పాటుగా 100 శాతం పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలని పిఓలను ఆదేశించారు. అదే విధంగా లాక్ డౌన్ నేపథ్యంలో అంగన్ వాడి కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు ఇస్తున్న పోషకాహారానికి సంబంధించిన రేషన్ ను నేరుగాలబ్దిదారుల ఇళ్లకే చేర్చాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ రేషన్ ఏ మేరకు గిరిజనులకు చేరిందనే విషయాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై పిఓలు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో తొలి విడతలో అంగన్ వాడీల నుంచి రేషన్ పంపిణీ జరిగిందని, ఇప్పటి వరకూ అంగన్ వాడి రేషన్ చేరని కుటుంబాలకు మలి విడతలో ఖచ్చితంగా చేరేలా చూస్తామని చెప్పారు. అంగన్ వాడీలకు చెందిన సూపర్ వైజర్లు, ఇతర సిబ్బందితో ఈ విషయంగా సమావేశాలను నిర్వహించి రేషన్ ఏ మేరకు చేరిందనే విషయాన్ని సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అందర్నీ పిలిచి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం సాధ్యంకానప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులను కూడా ఈపనికి  వినియోగించుకోవాలని కోరారు. వాలంటీర్ల ద్వారా జరుగుతున్న హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసవ సమయం దగ్గరపడిన గిరిజన మహిళల వివరాలన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలని, వారి ప్రసవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా పుష్ప శ్రీవాణి ఆదేశించారు. వివిధ ఐటీడీఏలలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయా, లేదా అనే విషయాలను పిఓలను అడిగి తెలుసుకున్నారు. కాగా గిరిజనుల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా మొత్తం గ్రామం అంతటికీ సోకే ప్రమాదం ఉంటుందని ఈ నేపథ్యంలోనే ఇంటింటికీ సర్వే చేసి, అనుమానితుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపాలని కోరారు. అలాగే  గిరిజన గ్రామాల్లో ప్రతి గిరిజనుడికి కూడా మాస్కులను అందించాలని కోరారు. వెలుగు సంఘాల ద్వారా తాము తక్కువ ధరకే మాస్కులు చేయించి గిరిజనులకు అందిస్తున్నట్లు ఈ సందర్భంగానే సీతంపేట టీటీడీఏ పిఓ తెలిపారు. కాగా లాక్  డౌన్ సమయంలో గిరిజనులకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ లభించేలా చూడాలని, అదే సమయంలో వాటి ధరలను కూడా నియంత్రించాలని  డిప్యుటీ సిఎం కోరారు. ప్రస్తుతం రవాణా ఖర్చులు అధికంగా ఉన్న సమయంలో అటు వ్యాపారులు కూడా నష్టపోకుండా ఇటు ప్రజలు కూడా మోసపోకుండా ధరలు నిర్ణయించి విక్రయించడానికి చర్యలను తీసుకోవాలని పిఓలకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారు. లాక్ డౌన్ సందర్భంగా క్వారంటైన్ కు సంబంధించిన అంశాలను పుష్ప శ్రీవాణి అడిగి తెలుసుకున్నారు. చింతూరు ఐటీడీఏ కు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు కూడా సరిహద్దులుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టులో పనులు చేయడానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారని చింతూరు పిఓ తెలిపారు. వలస కూలీలకు క్వారంటైన్ కేంద్రంలో పెట్టి అన్ని సదుపాయాలు కల్పించామని, అన్ని పరీక్షలను నిర్వహించి, క్వారంటైన్ గడువు ముగిసాక వారి స్వగ్రామాలకు పంపామని వివరించారు. కేఆర్ పురం పిఓ మాట్లాడుతూ, తెలంగా సరిహద్దుల నుంచి కూడా తమ ఐటీడీఏ పరిధిలోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా క్వారంటైన్ కు ఏర్పాట్లు చేసామన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో పెట్టామని తెలిపారు.  ఈ సమావేశంలో ఐటీడీఏ పిఓలు సి.ఎం. శ్రీకాంత్ వర్మ(సీతంపేట), డికె బాలాజీ (పాడేరు), ఎ.వెంకటరమణ (చింతూరు), సూర్యనారాయణ (కేఆర్ పురం), రవీంద్ర నాథ్ రెడ్డి (శ్రీశైలం), మణికుమార్ (నెల్లూరు) తదితరులు పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image