మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి

 


     హైదరాబాద్, ఏప్రిల్ 21, (అంతిమ తీర్పు) :                 ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన వార్తలు వస్తున్నందున తెలుగు రాష్టాల్లోని జర్నలిస్టులందరూ ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.


 వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు,  పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా వైరస్ ప్రభావం పొంచి ఉన్నప్పటికీ జర్నలిస్టులు సమాచార సేకరణ కోసం విధి నిర్వహణలో నిరంతరం పాల్గొంటున్నారు. ఇట్లాంటి క్లిష్ట  పరిస్థితిలో జర్నలిస్టులు వృత్తి కత్తి మీద సాము లాంటిది. వార్తలు, సమాచారం కోసం అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నందున, జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ముందుగా ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులనుండి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కరోనా వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం లేదని తెలియవస్తున్నది. 
 *జర్నలిస్టులు..ఈ జాగ్రత్తలు  పాటించండి*
1.  ప్రతి ఒక్క జర్నలిస్టు మాస్కు  తప్పని సరిగా ధరించి విధులు నిర్వహించాలి.   
2. సామాజిక దూరం పాటించకుండా రిపోర్టింగ్ చేయరాదు. 
3. శానిటైసర్ ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. 4. న్యూస్ కవర్ చేసేటప్పుడు గుంపులుగా గుమికూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 5. మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తున్నదని, కుటుంబానికి మీరే పెద్ద దిక్కు అని గుర్తించండి
6. మీడియా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాలలో జర్నలిస్టులు  సామాజికదూరం పాటించే విధంగా సీటింగ్ ఆరెంజిమెంట్స్ చేసుకోవాలి.
7.  జర్నలిస్టులకు మాస్కులు, శానిటైసర్లు అందుబాటులో ఉంచాలి.
8. యాజమాన్యాలు  జర్నలిస్టుల కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.
9.జర్నలిస్టులు అత్యవసర సేవల విభాగంలోనికి వస్తారు కనుక వారికి రక్షణ కిట్లను ప్రభుత్వం సమకూర్చాలి.
10.జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..