నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయం : కమిషనర్, సీఐ

నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయం : కమిషనర్, సీఐ
వైజీఎస్బీఏ ఆధ్వర్యంలో రజకులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ
ప్స్స 1. బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న కమిషనర్2
2. మాట్లాడుతున్న సీఐ జీ. దశరధరామారావు 
విశాలాంధ్ర - గూడూరు : ద యంగ్ గూడూరు షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ నిరుపేదలకు బాసటగా నిలవడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేశు, పట్టణ సీఐ జీ. దశరధరామారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని చాకలి వీధిలో వైజీఎస్బీఏ ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనీస్, వారి మిత్రుల సహకారంతో 30 రజక కుటుంబాలకు ఐదేసి కేజీల బియ్యం, 15 రోజీలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిజమైన నిరుపేదలను గుర్తించి  బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యుల సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయూతనందించిన అనీస్, మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.  పట్టణ సీఐ జీ. దశరధ రామారావు మాట్లాడుతూ అనీస్ సహకారంతో పనుల్లేక పస్తులుంటున్న రజకులను బాడ్మింటన్ అసోసియేషన్ ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. నిబంధనలు పాటిస్తూ ఇంటింటికీ వెళ్లి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ముఖానికి తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఓపిగ్గా ఇళ్లలోనే ఉండాలన్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని రజకులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. అసౌసియేషన్ అధ్యక్షులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురిటిపాలెం గిరిజన కాలనీలో 125 కుటుంబాలకు కూరగాయలు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం రజక కుటుంబాలకు చేయూతనందిస్తున్నామన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ కమిషనర్, సీఐ, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చమతెలిపారు. అనంతరం కమిషనర్, సీఐల.చేతుల మీదుగా రజక కుటుఃబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, వైజీఎస్బీఏ ప్రధాన కార్యదర్శి జీ. గిరిబాబు, కార్యదర్శి వల్లూరు రమేష్, స్థానికులు సాధిక్, అగ్ని, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image