వాలంటీర్లు,జర్నలిస్టులకు భోజనాలందించిన వై.సి.పి నేతలు

వాలంటీర్లు,జర్నలిస్టులకు భోజనాలందించిన వై.సి.పి నేతలు


వింజమూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు, జర్నలిస్టులకు మంగళవారం నాడు స్థానిక వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాయి బాలాజీ బోర్ వెల్స్ ప్రొప్రయిటర్ జూపల్లి.రాజారావు, మాజీ ఉప సర్పంచ్ మద్దూరు.లక్ష్మీప్రసాద్ రెడ్డి, మండాది.గోవిందరెడ్డిలు భోజన ప్యాకెట్లును అందజేశారు. ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అక్బర్ అలీ అహ్మద్ చేతుల మీదుగా భోజనాలను అందరికీ పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ తరుణంలో వాలంటీర్లు, జర్నలిస్టులు తమ తమ విధుల నిర్వహణలో విశేష సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. వింజమూరు మండలంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాతలు ముందుకు వస్తూ పేద ప్రజలతో పాటు విధులు నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, భోజనాలు అందించడం వారి దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. అందరి కృషి వలనే వింజమూరు మండలం గ్రీన్ జోన్ గా రికార్డులకెక్కిందన్నారు. అయిననూ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా లాక్ డౌన్ ముగిసే వరకు స్వీయ నిర్భంధంలో ఉంటూ ప్రభుత్వాల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, వై.సి.పి నేతలు రేవునూరి.శ్రీనివాసులురెడ్డి, జక్కం.మోహన్ రెడ్డి, బండి.క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.