ప్రామిసరీ నోటు-పరిచయం

*ప్రామిసరీ నోటు-పరిచయం* 


*1)* ఏ వ్యక్తి అయినా ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు తాను తిరిగి చెల్లించడానికి గాను రాసే వాగ్ధాన పత్రాన్నే ప్రామిసరీ నోటు అంటారు. ప్రామిస్ అంటే వాగ్ధానం అని అర్ధం. ప్రామిసరీ నోటులో..  డబ్బు తీసుకున్న వ్యక్తి ఎటువంటి షరతులు పెట్టకుండా డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి అడిగిన వెంటనే తిరిగి చెల్లించడానికి సిద్ధంగా వున్నట్లుగా ఉంటుంది. మొత్తంగా అప్పు తీసుకున్న వ్యక్తి ఎటువంటి షరతులు లేకుండా డబ్బు చెల్లించడానికి బాధ్యత వహించాలి.  


*2)* 18 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా ప్రామిసరీ నోటు రాయొచ్చు. మైనర్  ప్రామిసరీ నోటు రాయకూడదు. ఎవరైనా మైనర్ చేత ప్రామిసరీ నోటు రాయించుకున్నా అది చెల్లుబాటు కాదు. మానసిక అస్వస్థతతో ఉన్న వారి చేత కూడా ప్రామిసరీ నోటు రాయించకూడదు.


*3)* ప్రామిసరీ నోటుని తెల్ల పేపర్ మీద లేక బాండ్ పేపర్ మీద (నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్) లేక ఏదయినా ముద్రించిన పేపర్ మీద నైనా రాసుకోవచ్చు. నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ (10/-, 50/-, 100/- విలువైన స్టాంప్ పేపర్) అనేది రిజిస్ట్రార్ ఆఫీసులో లభిస్తుంది. ముద్రించిన ప్రామిసరీ నోటు ఏ షాపులో అయినా లభిస్తుంది. 


*4)* ప్రామిసరీ నోటు ఏ భాషలో అయినా రాసుకోవచ్చు. ప్రామిసరీ నోటును రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు.  


*5)* ప్రామిసరీ నోటు రాయాలంటే అప్పు ఇచ్చే వ్యక్తి, అప్పు తీసుకునే వ్యక్తి, ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా వుండాలి. ప్రామిసరీ నోటు అనేది ప్రధానంగా డబ్బు అప్పు ఇచ్చే సందర్బాలకే వర్తిస్తుంది. 


*6)* అప్పు తీసుకునే వ్యక్తి సాక్షుల సమక్షంలో ప్రామిసరీ నోటుని రాయాలి. ఒకవేళ అప్పు తీసుకునే వ్యక్తికి రాయటం రాకపోతే ఇద్దరు సాక్షుల్లో ఎవరి చేతనైనా ప్రామిసరీ నోటు రాయించొచ్చు. కొన్ని సందర్భాల్లో సాక్షులకు కూడా రాయటం చేతకాక పోతే ఏ ఇతర వ్యక్తి చేత నయినా ప్రామిసరీ నోటు రాయించి దస్తూరి సంతకం చేయించాలి. వీలైనంత వరకు డబ్బులు తీసుకున్న వ్యక్తి చేత ప్రామిసరీ నోటు రాయించటం మంచిది.


*7)* ప్రామిసరీ నోటులో తేదీ, స్థలం, ఎంత డబ్బును అప్పుగా తీసుకుంటున్నారు, ఎవరు అప్పు తీసుకుంటున్నారు, ఎవరు అప్పు ఇస్తున్నారు, అప్పు ఎంత, ఏ అవసరాల కొరకు అప్పు తీసుకుంటున్నారు, ఎంత వడ్డీకి అప్పు తీసుకుంటున్నారో తెలిపే వివరాలు  రాయాల్సి ఉంటుంది. 


*8)* N I (నెగోషియబుల్ ఇంస్ట్రుమెంట్) ACT సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోటు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి షరతులు లేకుండా ద్రవ్య పూర్వక (డబ్బు) లావాదేవీలు జరగడాన్ని అనుమతిస్తుంది. అంటే  ప్రామిసరీ నోటు ద్వారా అప్పు ఇవ్వొచ్చు లేదా అప్పు తీసుకోవచ్చు అని అర్థం. 


*9)* ప్రామిసరీ నోటు రాసిన వ్యక్తి తప్పనిసరిగా ప్రామిసరీ నోటు కింది భాగంలో రూపాయి రెవిన్యూ స్టాంప్ మీద సంతకం చేయాలి. ప్రామిసరీ నోటు రాసిన వ్యక్తి తన సంతకంతో పాటు తేదీ కూడా వేస్తే మంచిది. ఎందుకంటే నోటు రాయించుకున్న వ్యక్తి ఆ నోటును దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసినట్లవుతుంది. ఒక వేళ షూరిటీ (జామీనుదారు) కూడా అందుబాటులో ఉంటే అతని చేత కూడా అదే నోటు కింది భాగంలో రూపాయి రెవిన్యూ స్టాంపు పైన సంతకం చేయించుకుంటే మంచిది. కొన్ని సందర్భాల్లో షూరిటీ ఇచ్చిన వ్యక్తి నుండి వేరే ప్రామిసరీ నోటు మీద సంతకం కూడా చేయించుకోవచ్చు.


*10)* ప్రామిసరీ నోటులో ఒక రసీదు ఉంటుంది. నోటు రాయించేటప్పుడు రసీదు మీద కూడా అప్పు తీసుకున్న వ్యక్తి నుండి సంతకం తీసుకోవాలి. రసీదు మీద సంతకం చేయించేటప్పుడు ఒక రూపాయి రెవిన్యూ స్టాంప్ మీద సంతకం చేయించాలి. అలా రసీదు మీద సంతకం తీసుకొన్నట్లయితే అప్పు తీసుకున్న వ్యక్తికి డబ్బు ముట్టిందని అర్ధం. 


*11)* అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకపోతే అతనికి న్యాయవాది ద్వారా నోటీసు ఇవ్వొచ్చు. అయితే నోటీసు ఇవ్వటం తప్పనిసరి కాదు. కానీ నోటీసును ఇవ్వటం వలన త్వరగా డబ్బులు తిరిగి పొందే అవకాశం వుంది.


*12)* అప్పు తీసున్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వెంటనే సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు. 
● ప్రామిసరీ నోటు మీద రాసిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా కోర్టులో కేసు వేయవచ్చు. 
● నోటు రాసిన తేదీ నుండి 3 సంవత్సరాల తర్వాత ఆ నోటు చెల్లుబాటు అవ్వదు. ఒక వేళ అప్పు తీసుకున్న వ్యక్తి అసలులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి నట్లయితే.. చెల్లించిన తేదీ నుండి మరల 3 సంవత్సరాల వరకు ఆ నోటు చెల్లుబాటు అవుతుంది. 
● అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీ మాత్రమే తిరిగి చెల్లించి నట్లయితే అక్కడి నుండి 3 సంవత్సరాలనే లిమిటేషన్ వర్తించదు. అసలును తిరిగి చెల్లిస్తేనే లిమిటేషన్ పీరియడ్ వర్తిస్తుంది. 
● అప్పు తీసుకున్న వ్యక్తి అసలులో కొంత భాగాన్ని తిరిగి చెల్లించినట్లయితే ప్రామిసరీ నోటు వెనుక భాగంలో ఇద్దరు సాక్షుల సమక్షంలో అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం  చేయాలి. 
● ప్రామిసరీ నోటు అనేది సివిల్ కేసుగా పరిగణిస్తారు. కేసు కోర్టులో వేసేటప్పుడు కోర్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


*13)* కోర్టులో ప్రామిసరీ నోటుని ఉపయోగించి కేసు వేసిన తర్వాత కోర్ట్ వారు విచారించి డిక్రీ (ఆదేశం) ఇస్తారు. కోర్ట్ వారు ఇచ్చిన డిక్రీని (ఆదేశాన్ని) ఆ డిక్రీ పొందిన వ్యక్తి 12 సంవత్సరాలలోపు ఎప్పుడైనా కోర్ట్ ద్వారా అమలుచేయించుకోవచ్చు. 


*14)* కోర్ట్ డిక్రీ (ఆదేశం) ఇచ్చిన తర్వాత కూడా అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బుల్ని తిరిగి కట్టకపోతే  కోర్ట్ ద్వారా అతని ఆస్తులని జప్తు చేసి.. తద్వారా డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చు. అప్పు తీసుకున్న వ్యక్తి పేరిట ఎటువంటి ఆస్తులు లేనట్లయితే ఆ అప్పుని తిరిగి రాబట్టుకోలేము. ఒక వేళ అప్పు తీసుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే అతని జీతం నుండి కూడా డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చు 


*15)* అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే అతని వారసుల మీద కేసు వేసి డబ్బులు రాబట్టుకోవచ్చు. ఒక వేళ అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి వారసులకు అప్పు తీసుకున్న వ్యక్తి నుండి డబ్బులు తిరిగి పొందే చట్టబద్ధమైన హక్కు ఉంది.


*16)* *ప్రామిసరీ నోటు రాయించుకునే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
A) ప్రామిసరీ నోటు మీద రూపాయికి తక్కువ కాని రెవిన్యూ స్టాంప్ మాత్రమే వాడాలి. పోస్టల్ స్టాంప్ వాడకూడదు. 
B) వీలైనంతవరకు అప్పు తీసుకున్న వ్యక్తి, సాక్షులు, దస్తూరి ఒకే సందర్భంలో సంతకాలు జరిగేలా చూసుకోవాలి. 
C) తరచుగా ఇతరులకు అప్పు ఇచ్చేవారు మనీ లెన్డర్స్ చట్టం ప్రకారం లైసెన్స్ తీసుకొని అప్పు ఇవ్వటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో అప్పు తీసుకున్నవారు తరచుగా అప్పులు ఇవ్వటం ద్వారా మనీ లెండర్స్ చట్టాన్ని మీరు అనుసరించలేదని ఎదురు తిరిగే అవకాశం ఉంది. 
D) 20,000/- రూపాయల కంటే ఎక్కువ మొత్తం అప్పు ఇచ్చేప్పుడు తప్పని సరిగా ఆన్ లైన్ ద్వారా లేదా చెక్ ద్వారా ఇవ్వటం మంచిది. ఎందుకంటే భవిష్యుత్తులో అప్పు తీసుకున్న వ్యక్తి నేను డబ్బులు తీసుకోలేదని వాదన చేసినా కూడా మనము నిరూపించుకోవచ్చు.
E) వీలైనంత వరకు అప్పు తీసుకున్న వ్యక్తి చేతనే ప్రామిసరీ నోటు రాయిస్తే మంచిది. నోటు అతని చేత రాయించటం వలన అతను అప్పు తీసుకున్నట్లుగా నిరూపించవచ్చు. 
F)ప్రామిసరీ నోటులో పేర్కొన్న తేదీ, స్థలం, సంతకంలో కొట్టి వేతలు లేకుండా చూసుకోవాలి.ఒక వేళ కొట్టి వేతలు ఉంటే మరొక ప్రామిసరీ నోటును రాయించుకోవాలి. 
G) ప్రామిసరీ నోటు ఎంత డబ్బు లావాదేవీల కైనా రాసుకోవచ్చు. కానీ కోర్ట్ అంత డబ్బు నీకు ఎలా వచ్చిందని అప్పు ఇచ్చిన వ్యక్తిని అడిగే అవకాశం ఉంది. నిరూపించుకోవాల్సిన బాధ్యత అప్పు ఇచ్చిన వ్యక్తి మీద ఉంటుంది. 
H) ప్రామిసరీ నోటును ఒకే పెన్నుతో రాస్తే మంచిది. రెండు, మూడు పెన్నులు ఉపయోగించకూడదు. ఒకే హాండ్ రైటింగ్ ఉపయోగించాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లకుండా పోతుంది. 
I) అప్పు ఇచ్చిన వ్యక్తి  ప్రామిసరీ నోటులో దస్తూరి రాయకూడదు. 
J) అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్, డ్రైవింగ్ కార్డ్ నకలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే కోర్టులో కేసు వేయాల్సి వస్తే అతని అడ్రస్ అవసరం ఉంటుంది.            


*17)* *అప్పు తీసుకొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
A) ఖాళీ ప్రామిసరీ  నోటుపై ఎట్టి పరిస్థితుల్లో సంతకం చేయకూడదు. ప్రామిసరీ నోటు పూర్తిగా నింపిన తర్వాతే ప్రామిసరీ నోటు కింది భాగంలో సంతకం చేసి  తేదీ కూడా వేస్తే మంచిది. 
B) ఒక వేళ ప్రామిసరీ నోటుతో పాటు చెక్కును షూరిటీగా ఇవ్వాల్సి వస్తే.. ప్రామిసరీ నోటు వెనకాల చెక్ నెంబర్ రాసి ఆ చేక్కుని షూరిటీగా ఇస్తున్నట్లు తెలిపి సంతకం చేయాలి. ఇలా జాగ్రత్త తీసుకోవటం వలన అప్పు ఇచ్చిన వ్యక్తి చెక్ ని క్రిమినల్ కోర్టులో వేయటానికి అవకాశం ఉండదు. 
C) నూటికి రు.2/- వడ్డీ మాత్రమే ప్రామిసరీ నోటులో రాయాలి. అధిక వడ్డీలు చెల్లుబాటు అవ్వదు.
D) ప్రామిసరీ నోటులో మీ సంతకం తీసుకొని, ఒక వేళ మీ సమక్షంలో నోటు పూర్తి చేయకుండా ఇతరులు ఎవరైనా ఆ నోటును దుర్వినియోగం చేస్తారని భావిస్తే సివిల్ కోర్టుని ఆశ్రయించి ఆ నోటు చెల్లుబాటు కాకుండా ఆర్డర్ పొందొచ్చు.  


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image