డా.  బి  ఆర్ అంబేద్కర్ కు నివాళి

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ,ఏప్రిల్  14. (అంతిమ తీర్పు) : డా.  బి  ఆర్ అంబేద్కర్ 129వ జన్మదిన సందర్భముగా,  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు  , విశ్వవిద్యాలయ అధ్యాపకులను విద్యార్థులను ఉద్దేశించి అధికార ప్రసంగాన్ని పంపించారు. ఆ అధికార ప్రసంగములోని ముఖ్య సారాంశము భారత రత్న బాబాసాహెబ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రధాన వాస్తుశిల్పి. ముసాయిదా కమిటీ ఛైర్మన్, ఆయన భారత రాజ్యాంగంలోని పలు నిబంధనలపై చెరగని ముద్ర వేశారు. గొప్ప పండితుడు, ఆర్థికవేత్త మరియు న్యాయవాది అయినా  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారిని నెహ్రూ మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి గొప్ప ప్రతిభావంతులు కూడా  అతని పాండిత్యం మరియు వివేకంను  గుర్తించారు.
భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను చేర్చడానికి బాధ్యత వహించినందున అతను  కోట్లమంది దళితులకు దేవుడిగా ఉద్భవించాడు మరియు ఈ నిబంధనలు భారతదేశంలోని  ఆ కోట్లమంది  నిరుపేద  ప్రజల  సాధికారతకు కారణమయ్యాడు.
ఆ రోజుల్లో చాలా మంది  నాయకులకు ఇష్టంలేకున్నా డాక్టర్ అంబేద్కర్ మహిళా సాధికారత కోసం గట్టిగా పోరాడారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ వంటి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత, భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, న్యాయవ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థల కోసం ఉత్తమమైన నిబంధనలను మన రాజ్యాoగములో చేర్చారు.
భారతదేశంలోని వైవిధ్య లక్షణాల దృష్ట్యా, భిన్నత్వంలో ఏకత్వం ఉండేలా భారత రాజ్యాంగం రూపొందించారు. అంబేద్కర్ యొక్క జ్ఞానం మరియు  గొప్పతనాన్ని భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలలోని  సరళత్వం మరియు జటిలత్వం మేలుకలయిక యేక సమపాళ్లలో వుండేల నిర్మించడంలో చూడవచ్చు.
అనేక సవరణలు, తొలగింపులు మరియు కూడికలు ఉన్నప్పటికీ, భారత రాజ్యాంగం ఇప్పటికీ ప్రపంచంలోని ఉత్తమ వ్రాతపూర్వక రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మొదటి కేంద్ర న్యాయ మంత్రి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తన బహుమితీయ వ్యక్తిత్వానికి మాత్రమే కాకుండా, భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య విజయానికి  ఆయన చేసిన విశేష కృషికి కూడా ఈ రోజు బాగా గురితించబడుతున్నారు.
డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్  పేర్కొన్న మరియు పాటించిన సూత్రాలు మరియు విలువలను భారత ప్రజలు ముఖ్యంగా యువత అనుకరించడానికి మరియు అనుసరించడానికి ప్రయత్నించాలి. అదే మనము అతనికి  చెలించే  నిజమైన నివాళి.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..