మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..

మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..


బియ్యం పంపిణీ చేస్తున్న ట్రస్ట్ అధ్యక్షుడు షబ్బీర్.
గూడూరు: మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా గూడూరు పట్టణము మరియు రూరల్ ప్రాంతాల్లో గత 17 రోజుల నుండి ఆహార పొట్లాలు,బ్రెడ్స్, పండ్లు, సానిటైజేషన్ మాస్కులు మజ్జిగ ప్యాకెట్స్, కూరగాయలు పంపిణీ చేస్తూ వస్తున్నాం, అందులో భాగంగానే 18 వ రోజు  నెల్లటూరు గ్రామంలో బియ్యం పంపిణి చేయడం జరిగింది అని మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్. షబ్బీర్ తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ నెల్లటూరు గ్రామంలో ఉన్న పేద ప్రజలు రోజువారీ పని లేక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వున్నారని అక్కడి వారు కొంతమంది మిత్ర ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అని కావున ఈ రోజు  కొంతమంది నా మిత్రులు  నరేంద్ర (జపాన్), కిరణ్ కుమార్ (ఉత్తర ప్రదేశ్), వెంకటేష్ (చెన్నై) మరియు గుణ శేఖర్ (బెంగుళూరు)ల సహాయ సహకారాలతో 35 కుటుంబాల వారికి బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఇదే విధంగా లాక్డౌన్ ఉన్నంత కాలం మిత్రుల సాయంతో మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటామని అన్నారు. మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి సహకారం అందించిన మిత్రులందరికీ  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షబ్బీర్, సభ్యులు అబ్దుల్లా, జాఫర్ అలీ, జియావుల్ హక్,ఆరీఫ్, రియాజ్, షాకీర్, అయాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
స‌మాజ చైత‌న్య‌మే మ‌న ఆయుధం కావాలి... * ఎస్‌జెఆర్‌వో తొలి రాష్ట్ర స్థాయి స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపు విజ‌య‌వాడ‌: నిత్య జీవితంలో ప్ర‌జ‌లు ఎదు‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం కోసం సంస్థ స‌భ్యులంద‌రూ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని సోష‌ల్ జ‌స్టిస్ రైట్ ఫ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్‌జెఆర్‌వో) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపునిచ్చారు. ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర స్థాయి తొలి ఎగ్జిక్యూటీవ్ స‌మావేశాన్ని శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జ‌‌క్కా సాయిబాబు మాట్లాడుతూ ఆర్థిక‌, సామాజిక, రాజ‌కీయ వ్య‌వ‌స్థల్లో ‌జ‌రుగుతున్న అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతం కార‌ణంగా న‌ష్ట‌పోతున్న పౌరుల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెలుగులోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా సామాజిక బాధ్య‌త‌గా భావించి సంస్థ స‌భ్యులు ప‌నిచేయాల‌ని కోరారు. స‌మాజంలో మార్పు రావాల‌ని కోరుకునే ప్ర‌తి వ్య‌క్తిని గుర్తించి వారితో క‌లిసి ప‌నిచేయ‌డం సంస్థ ల‌క్ష్యాల్లో ఒక‌ట‌ని పేర్కొన్నారు. స‌మాజంలో పెరిగిపోతున్న కాలుష్యం, త‌గ్గిపోతున్న నైతిక విలువ‌లు, ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో వ‌స్తున్న మార్పులు వంటి అంశాల‌పై స‌భ్యులు నిరంత‌రం గుర్తుచేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సామాన్య పౌరుల‌ను క‌లుపుకుని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా వారి ప‌రిష్కారం సులువవు‌తుంద‌న్నారు. 7 ద‌శాబ్ధాల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా ప‌నిచేసిన స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వానికి ముందుగా స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ‌జాతిపిత మ‌హాత్మా‌గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించి అనంత‌రం జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా సంస్థ స‌భ్యుల‌కు గుర్తింపు కార్డులు అంద‌జేసి సంస్థ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా సేవ‌లందిస్తామ‌ని ప్ర‌మాణం చేయించారు. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం గ్రో గ్రీన్‌, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి మ‌నిషిలా జీవించాల‌ని కోరారు. స‌మావేశానికి ఎస్‌జెఆర్‌వో మ‌హిళా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాస‌రి ధాత్రి అధ్య‌క్ష‌త వ‌హించ‌గా కృష్ణా జిల్లా అధ్య‌క్ష‌, ప్రధాన కార్య‌ద‌ర్శులు చెన్నాప్ర‌గ‌ఢ ప్ర‌సాద్‌, కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌, మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు కె.భాగ్య‌ల‌క్ష్మీ, వివిధ జిల్లాల నుంచి సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.