లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ


ఎమ్మిగనూరు,టౌన్,ఏప్రిల్ 14 (అంతిమతీర్పు):-మన దేశ ప్రజల ప్రాణాలను  కబలిస్తున్న కరోన వైరస్ ధాటికి పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలు అడుగు బయట పెట్టలేని తరుణంలో స్థానిక హెచ్ బి ఎస్  కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకునిఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి  మాజీ ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు  తెదేపా పట్టణ యువ నాయకులు  దయాసాగర్ 21వ వార్డులోని పిరమిడ్,పెద్దాసుపత్రి,గీతమందిరం, ఆడివప్పమఠం దగ్గర తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలు అయినా  చెయ్యి ఆడితే గానీ డొక్కాడని పరిస్థితి గల నిరుపేద కుటుంబాలు గల సుమారు 250 కుటుంబాల వారికి  కావాల్సిన బియ్యం,బ్యాళ్లు, కారం,గోధుమపిండి, ఉప్మారవ్వ,సన్ ఫ్లవర్ ఆయిల్,2 dettol సబ్బులు  పంపిణీ చేయడం జరిగిందని టిడిపి యువ నాయకులు దయాసాగర్ తెలిపారు.ఈ సందర్భంగా వారికి కాలనీవాసులు హృదయ పూర్వక ధన్యవాదాలుతెలుపుతూ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ సేవలు మాకు ఎంతో అవసరమని ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నో చేయాలని కాలనీవాసులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రవి,విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..