తెలంగాణ లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణ లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..


హైదరాబాద్, ఏప్రిల్ 11 ;
యావత్ భారతమంతా 21రోజుల లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాలని భావించాయి రాష్ట్రాలు. ఈ మేరకు ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన సీఎంలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 
దేశం మొత్తం గురించి ప్రధాని నిర్ణయం ఆదివారం ప్రకటిస్తారనగా ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ, ఒడిశాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కన్ఫామ్ చేసేశాయి. ఇప్పుడు తెలంగాణ లాక్‌డౌన్ గురించి రాష్ట్ర ప్రజల సందేహాలపై క్లారిటీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. శనివారం ఏప్రిల్ 11న మీటింగ్ పెట్టి స్పష్టం చేశారు. 


ముందు చెప్పినట్లుగానే ఇతర దేశాలనుంచి ఉత్తరాధికి వచ్చి అక్కడి నుంచి మనకొచ్చింది. 


ఇప్పటివరకూ కరోనా కేసులు 503నమోదయ్యాయి. 14 మంది చనిపోగా, 96 మంది కోలుకున్నారు. 


మన దగ్గర హాస్పిటల్లో 393మంది ఉన్నారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని 1200మందిని పట్టుకొచ్చి టెస్టులు నిర్వహించాం.


ఇప్పుడు క్వారంటైన్లో 1650మంది ఉన్నారు. 


కేసులు నమోదవడం తగ్గింది. ఒకట్రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు


వ్యాధి ప్రభలకుండా నిరోధించే చర్యలు.. ముమ్మరం చేశాం. ప్రజల నుంచి సహకారం అందుతుంది. రాష్ట్రంలో 243చోట్లు ఇటువంటివి జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రదేశాల్లో 120ప్రదేశాల్లో టెస్టులు చేస్తున్నాం. 


ఇప్పటి వరకూ ఒక్కరి పరిస్థితి కూడా విషమించకుండానే చర్యలు తీసుకుంటున్నాం.


మహారాష్ట్రలో వైరస్ ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి మనకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సీరియస్ గా తీసుకుని అంతా బంద్ చేశాం.


ఏప్రిల్ 30వరకూ లాక్ డౌన్ కొనసాగించి.. మే1 తర్వాత పరిస్థితిని బట్టి తర్వాత చర్యలు తీసుకుంటాం.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image