మన్నేటి. వెంకటరెడ్డి సేవలు మమకారానికి నిలువెత్తు నిదర్శనం. :ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ

మన్నేటి. వెంకటరెడ్డి సేవలు మమకారానికి నిలువెత్తు నిదర్శనం. :ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ


ఉదయగిరి, ఏప్రిల్ 4 (అంతిమతీర్పు ఇంచార్జ్-దయాకర్ రెడ్డి) ఉదయగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మన ఫౌండేషన్ ప్రతినిధి మన్నేటి. వెంకటరెడ్డి సేవలు మమకారానికి నిలువెత్తు నిదర్శనమని ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ కొనియాడారు. ఉదయగిరి మండలంలోని కొండాయపాళెం పంచాయితీ పరిధిలోని 7 గ్రామాల ప్రజలకు మన్నేటి.వెంకటరెడ్డి కూరగాయల పంపిణీకి శ్రీకారం చుట్టిన సేవా కార్యక్రమానికి ఉదయగిరి సి.ఐ ఉప్పాల. సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరై లాంచనంగా కూరగాయలను ఇంటింటికీ పంపిణీ చేశారు. గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మన్నేటి.వెంకటరెడ్డి బెంగుళూరులో వ్యాపారరీత్యా స్థిరపడినప్పటికీ జన్మభూమిపై మమకారంతో మన ఫౌండేషన్ స్థాపించి కొండాయపాళెం పంచాయితీలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను తన అనుచరుల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదేమో. ఇప్పటికే వాటర్ ఫ్లాంట్, గ్రీన్ పార్క్, పాఠశాలలో అదనపు తరగతి గదులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా క్రీడా పరికరాలు పంపిణీ తదితరాలతో మనసున్న మారాజుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తాజాగా కరోనా వైరస్ విపత్తు నేపధ్యంలో ప్రజలందరూ వారి వారి నివాసాలకే పరిమితమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో డెల్టా ప్రాంతాల సేవాతత్పరులకు ధీటుగా మెట్ట ప్రాంతంలో నిత్యావసర ఫల సరుకుల పంపిణీకి ముందడుగు వేసి ఔరా అనిపిస్తున్నారు. కొండాయపాళెం పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు అధికంగా కూలిపనులే జీవనాధారంగా ఉంటాయి. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు మన్నేటి నేతృత్వంలోని మన ఫౌండేషన్ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కూరగాయల పంపిణీకి సిద్ధమైంది. 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు