రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టడం ఒక్క జగన్ కే చెల్లింది.   :గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

తేది.05.04.2020
       
కరోనా విపత్తులోను రోగ రాజకీయాలు చేస్తారా? 
గుంపులుగా తిరుగుతూ వైసీపీ ప్రచారం చేస్తారా? 
: ధ్వజమెత్తిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
దేశం నుంచి కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధుల విడుదల చేస్తే మిగిలిన రాష్ట్రాలు వాటితో పాటు తమ వాటా కొంత జతచేసి పేద ప్రజలకు సాయం అందిస్తున్నారు. కాని ఏపీలో మాత్రం అధికారపక్షం అందుకు భిన్నంగా కేంద్రం ఇచ్చిన నిధులను పంచకుండా పేదలను క్షోభకు గురి చేస్తుంది. కేంద్రం 3 నెలల రేషన్ సరుకులు, 3 నెలల నిధుల సాయం ఒకే దఫా ఇవ్వమంటే జగన్ మాత్రం వివిధ దఫాలుగా ఇచ్చి పేదల కడుపు కొడుతున్నారు. అంతే కాకుండా కేంద్రం ఆర్ధిక సాయంగా  పంచాయతీలకు, మునిసిపాలిటీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.1301 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ద్వారా  రూ.491.41 కోట్లు, విపత్తుల సహాయ నిధి కింది ముందస్తుగా రూ.559.50 కోట్లు. ఇలా మొత్తంగా 2,352 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ద్య కార్మికులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పని చేసే ఉద్యోగస్థులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉంది. పైపెచ్చు కేంద్రం నిధులను జగన్ జేబులో నుంచి ఇచ్చినట్లుగా వైకాపా నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ప్రస్తుత పరిస్థితిలో గుంపులు గుంపులుగా చేరి, బౌతిక దూరం పాటించకుండా, కనీస జాగృత్తలు లేకుండా కోవిడ్ వైరస్ ప్రజలకు విస్తృతంగా సోకేలా వైకాపా నాయకులు చేయడం హేయం.  కరోనా విపత్తులో సహాయ ఉపశమన చర్యల్లో పోటీ పడాలి తప్పా రోగ రాజకీయాలు మానుకోవాలి. కేంద్రం ఆఖరికి బియ్యం, కందిపప్పు ఇస్తే వాలెంటరీల ద్వారా ఇళ్లకే పంపిస్తానని హామీనిచ్చి చివరకు ప్రజలను క్యూలో నిలబెట్టి హింసించారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జగన్ చేపట్టిన చర్యలు సూన్యం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కరోనాను పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో అంతమొందించవచ్చని చెప్పి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ఎక్కడ ప్రశ్నిస్తుందన్న భయంతో రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టడం ఒక్క జగన్ కే చెల్లింది.   
 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image