కిట్స్ కొనుగోళ్లలో ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుంది :కాసు


తాడేపల్లి, ఏప్రిల్ 21.(     అంతిమతీీర్పు) :               


*పార్టీ ఎంఎల్ ఏ  శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్*...


*కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు*. 


*కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు అర్ధ రహితం 


కిట్స్ కొనుగోళ్లలో ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుంది


---------------------------------------------------
పార్టీ ఎంఎల్ ఏ    కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే....ఆయన మాటల్లోనే.....


కరోనా యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచంలోఅత్యంత బలమైన దేశాలు అమెరికా,ఫ్రాన్స్,ఇటలీ,స్పెయిన్ వంటి దేశాలు కూడా కుదేలవుతున్నాయి.


137కోట్ల భారతదేశంలో సైతం ప్రధాన నరేంద్రమోది,మన ముఖ్యమంత్రి  వైయస్ జగన్ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్స్వి,యనిర్భంధం అని పెట్టి కరోనాను అరికట్టేవిధంగా పనిచేస్తుంటే కొందరు రాజకీయనేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. 


ప్రపంచంమారింది...పచ్చకామెర్ల వాళ్లు...చంద్రబాబుగారు మారడం లేదు.బాధకలిగించే విషయం ఏమంటే చంద్రబాబు లాంటి వారికి వత్తాసు పలుకుతూ కన్నాలక్ష్మీనారాయణ మాట్లాడటం బాధకలుగుతోంది.


ఇది అందరికి తెలిసిందే...లాక్ డౌన్ వల్ల వ్యాధిని మరింత ప్రబలకుండా చేస్తున్నాం.కాని వ్యాధి వచ్చినవారికి నిర్ధారణ చేసి నియంత్రణ చేయాలి.


నిర్ధారణ చేయాలంటే పరీక్ష కిట్స్ అవసరం.అవి అవసరానికి సరిపడాలేవు ఏ రాష్ర్టానికి ఆ రాష్ర్టం తెప్పించుకోండి అని స్వయంగా ప్రధానిగారి మీటింగ్ లో అమిత్ షాగారు చెబితే మన ముఖ్యమంత్రిగారు,అధికారులు వెంటనే నిర్ణయం తీసుకుని రెండులక్షల టెస్టింగ్ కిట్స్ ను ఒక్కొక్కటి 730 రూపాయలకు ఆర్డర్ చేయడం జరిగింది.


కేంద్రం ఏ కిట్స్ నైతే 790 రూపాయలకు ఆర్డర్ చేసిందో మనం ఇంకా బేరమాడి 730 రూపాయలకు ఆ కిట్స్ తెచ్చుకోవడం జరిగింది.


పైగా 25 శాతం మాత్రమే పేమెంట్ చేసి,మిగిలిన మొత్తం ఇవే కిట్స్ ను వేరే రాష్ర్టాలకు తక్కువధరకు ఇస్తే మేం ఆ ధరే చెల్లిస్తామనే నిబంధనను కూడా విధించింది.ఇంత సంక్లిష్టపరిస్దితులలో కూడా జాగ్రత్తలు తీసుకుంది.


దానికి కూడా వీరు విమర్శలు చేస్తున్నారంటే ప్రజలు అర్దం చేసుకోవాలి.మేం ఏమీ తప్పుపట్టడంలేదు.కేంద్రప్రభుత్వం 790 రూపాయలకు కొనిందని మేం తప్పుపట్టడం లేదు.ఆరోజున అది అవసరం అయి ఉండవచ్చు.ఆరోజున అది రేటు ఐఉండవచ్చు.


ఎలా ఉంటుందంటే డిమాండ్ ,ప్రొడక్షన్ పెరిగే కొలది రేట్లు మార్కెట్ లో తగ్గుతుంటాయి.రేపు రేట్లు మారుతూ ఉండవచ్చు పెరగవచ్చు,తగ్గవచ్చు.కాని కేంద్రప్రభుత్వం కొన్నదానికంటే తక్కువధరకు కొన్నాం అని చెబుతున్నాం.


ఈరోజు మీరు చూడండి భారతదేశంలో టెస్ట్ లు జరుగుతున్నాయి.కేంద్రప్రభుత్వం షుమారు 3 లక్షల 84 వేల టెస్ట్ లు చేసింది.అంటే ప్రతి పదిలక్షలలో మీరు సగటు తీసుకుంటే 270 మందికి చేశారు. 


అదే రాష్ర్టాలలో తీసుకుంటే మొట్టమొదటి స్ధానంలో రాజస్ధాన్ ఉంది.ప్రతి పదిలక్షలమందిలో 749 మందికి వారు పరీక్షలు చేసారు.రెెండోస్ధానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.ప్రతి పదిలక్షలమందిలో 629 మందికి పరీక్షలు చేసింది.


నేను ఇందాక చెప్పినట్లు వ్యాధి నిర్ధారణ చేసుకుని క్వారంటైన్ కు పంపి ఆ తర్వాత కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్ని రకాల చర్యలు చేపడుతుంటే టిడిపి నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.


జగన్ గారి ప్రభుత్వం టెస్టింగ్ కిట్స్ తేవడంలో వైఫల్యం చెంది ఉంటే,ఇంకా అధికధర పెట్టి కొని ఉంటే మీరు విమర్శించినా ఒప్పుకుంటాం.


 ప్రభుత్వం పారదర్శకంగా చేస్తుంటే కేవలం ఆత్మస్ధైర్యం దెబ్బతీయాలి,ఎప్పుడులాగే గ్లోబెల్ ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్నిఅభాసుపాలు చేయాలని తప్పితే వేరేదేమైనా ఉందా ఇక్కడ.


ప్రజలకు అన్ని తెలుసు.అందుకే శ్రీవైయస్ జగన్ గారిని అఖండ మెజారిటితో గెలిపించారు.కన్నాగారు అంటారు.....కరోనా వ్యాప్తికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణం అంట.అదే రోజు పక్కనే పైన పేజీలో టిడిపినేత సబ్బం హరి గారు....కరోనాను జగన్ గారు తెలుసుకోలేకపోయారు అందుకే అది వ్యాప్తి చెందుతోంది.అసలు ఇద్దరు కలిపి ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది.


కరోనా నియంత్రణను అడ్డుకునే విషయంలో అన్ని రాష్ర్టాలలోకి ఒక్కడుగు ముందుకు ఉంటున్న రాష్ర్టం ఆంధ్రప్రదేశ్.


136 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో 17,656 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.అంటే సగటు .001 శాతం.ఐదుకోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసులు 722. అది కూడా .001 శాతమే.


ఇదే మీరు గుజరాత్ తీసుకుంటే ఆరుకోట్ల జనాభా ఉంటే పాజిటివ్ కేసులు 1851.అంటే .003 శాతంగా ఉంది.


ఏడుకోట్ల జనాభాతో ఉన్న మధ్యప్రదేశ్ లో 1485 కేసులు సగటు .002 శాతం.మేం ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు.అక్కడ విపరీతపరిణామాలు ఉండవచ్చు.అందువల్ల అక్కడ  కేసులు పెరగవచ్చు.రేపు ఇక్కడా పెరగవచ్చు.కాని ప్రయత్నంలో లోపం లేదు.


శ్రీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఎటువంటి లోపాలకు తావు ఇవ్వకుండా చాలా స్టేబుల్ గా వ్యాధిని అరికట్టడానికి పనిచేస్తోంది.


ఏ రాష్ర్టంలో కూడా ఇక్కడలా వాలంటీర్ సిస్టమ్ లేదు.ప్రతి 50 ఇళ్లను వాలంటీర్లు కాపలా కాస్తున్నారు.వారి ప్రాణాలను పణంగా పెట్టుకుని
పోలీసు,వైద్యఆరోగ్యసిబ్బందితోపాటు వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు.


ఆ 50 ఇళ్లలో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చడం,వారితో నిత్యం మాట్లాడటం,రేషన్ అందించడం,వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్,క్వారంటైన్  సెంటర్లకు పంపించడం వంటివి ఇంత పకడ్భందిగా చేస్తుంటే కనీసం ప్రోత్సహించకుండా నిత్యం విమర్శిస్తున్నారు.


 ఇలా విమర్శలు చేసేవారిని ఏమి చేయాలనేది ఆంధ్రరాష్ర్ట ప్రజలే ఆలోచించాలి.నిజంగా కన్నాలక్ష్మీనారాయణగారు కాణిపాకం అంటున్నారు.కాణిపాకంలో మీరు ప్రమాణం చేయండి.ఆంధ్రప్రదేశ్ 730 రూపాయలకు రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను కొనడం తప్పా.....ఇలా అయితే అవే కిట్ లను  కేంద్ర ప్రభుత్వం 790 రూపాయలకు కొనడం కూడా తప్పే కదా.


 ఈ రెండింటిపై మీరు ప్రమాణం చేయగలుగుతారా...మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి.ఈరోజు సలహాలు,సూచనలు ఇచ్చి జగన్ గారి ప్రభుత్వాన్ని,ఈ రాష్ర్టాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిపోయి మీరు 
ఎల్లోమీడియా,చంద్రబాబు  ట్రాప్ లో మీరు పడుతున్నారు.


 సబ్బం హరిగారు స్టేట్ మెంట్ ఒకటి చదివాను....అదేమంటే మాకు గనుక 70,80సీట్లు ఉంటే దిమ్మతిరిగే పని చేసేవాళ్లం...జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని కూల్చేపరిస్దితి తెచ్చేవాళ్లం అని వ్యాఖ్యానించారు.


కరోనాతో అతలాకుతలం అయిన పరిస్ధితులలో ఇవా మీరు మాట్లాడాల్సిన మాటలు....అంటే మీకు 70,80 సీట్లు ఉంటే మళ్లీ పశువులను కొన్నట్లు జగన్ గారి పార్టీనుంచి ఎంఎల్ ఏలను కొని మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేవాళ్లా....


ఈ సమయంలో ఇవా మీ ఆలోచనలు.....ఇంత దుర్మార్గమైన ఆలోచనలతోనా మీరు ఉండేది.ఎన్టీఆర్ గారికే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారి ఆలోచనలు మీకు వ్యాప్తి చెందుతాయికదా...మీరు వేరేగా ఎలా ఆలోచిస్తారు.  


విచిత్రం ఏమంటే ....కనీసం కోరుకునేటప్పుడు 70,80 సీట్లు ఏంటి...ఇంత చెత్తఆలోచనలు ఏంటి.మెజారిటీ రావాలి...ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనలు ఉండాలి కాని చెత్తబుధ్దులు,చెత్తఆలోచనలు... వెన్నుపోటు పొడిచేవారికే ఉంటాయని తెలియచేస్తున్నాం.


ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేం చెప్పేది ఒక్కటే.అందరం కూడా దేశప్రధాని,మన ముఖ్యమంత్రిగారు చెప్పినట్లు స్వియనిర్భంధంలో ఉందాం.ఇంకా ఎటువంటి ఆంక్షలు వస్తాయో తూచతప్పకుండా పాటిధ్దాం.ఖచ్చితంగా ఈ మహమ్మారిని గెలిచేరోజు వస్తుంది.నెలలు పట్టచ్చు.ఇంకా కష్టకాలం రావచ్చు.ఏది జరిగినా అంతిమంగా విజయం మానవజాతిదే అవుతుంది.


నేను ఇందాక ఓ సీనియర్ అధికారిని అడగాను...ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే...రాష్ర్టంలోకరోనా నియంత్రణలో అంతాపకడ్భందీగా జరుగుతోంది.స్టేబుల్ గా ఉంది.సిఎంగారు నిత్యం రివ్యూలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.అది వాలంటీర్లద్వారా ప్రజలకు చేరుతోంది.ఇదే సమయంలో చంద్రబాబు లేడు కాబట్టి సరిపోయింది.లేదంటే రివ్యూలు,ప్రెస్ మీట్లంటూ గంటలకొద్ది చావగొట్టేవాడు అని అన్నారు.


అదే జగన్ గారికి,చంద్రబాబుగారికి ఉన్నతేడా.వేమన శతకం ఒకటి గుర్తుకువస్తుంది...అల్పుడెపుడు పలుకు ఆడంబరంగా...సజ్జనుండు పలుకు చల్లగా... కంచుమోగునట్లు కనకంబు మోగునా... విశ్వదాభిరామవినురవేమ.


అలాగే జగన్ గారు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేతత్వం.చంద్రబాబుగారిది మీకు తెలుసు కదా  పనిచేయడు...చేసేవారిని చేయనీయడు.


కరోనా నియంత్రణకు జగన్ గారి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది.


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image