చరిత్రలో  ఈరొజు - మే 04 - సంఘటనలు

 


 చరిత్రలో  ఈరొజు - మే 04 - సంఘటనలు


1979: ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.


1989: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ [1] అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారంలేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.


 *🌷జననాలు🌷* 


1767: త్యాగరాజు, (త్యాగయ్య, త్యాగబ్రహ్మ). నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847)


1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.


1934: అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత


1942: దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)


1950: కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.


1950: నరమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.


1960: డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.


 *🍁మరణాలు🍁* 


1979: గుడిపాటి వెంకట చలం, ప్రముఖ రచయిత. (జ. 1894)


1799: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750)


 *🌼జాతీయ దినాలు🌼* 


** అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం .


** వరల్డ్ గివ్ ( give ) డే.