తక్షణమే కోటి మంది కాపు మహిళలకు జగన్ హామీ మేరకు రూ.15వేలు సాయం అందించాలి : బోండా ఉమామహేశ్వరరావు 

తేదీః 09-05-20
బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం వివరాలు
నవరత్నాల పేరుతో దగా- జగన్ ఏడాది పాలనలో ఏ ఒక్క సామాజికవర్గం అయినా బాగుపడ్డారా
కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బ్రాహ్మణ కార్పోరేషన్ల ద్వారా ఒక్కరికి కూడా సాయం అందలేదు
తక్షణమే కోటి మంది కాపు మహిళలకు జగన్ హామీ మేరకు రూ.15వేలు సాయం అందించాలి
టీవీ-5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- బోండా ఉమామహేశ్వరరావు 
         రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను ఎత్తిచూపితే.. మాపై మాచర్లలో హత్యాయత్నం చేశారు. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. వారిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఫ్యాక్షన్ మనస్తతత్వంతో పనిచేస్తోంది. టీడీపీనే కాకుండా అన్ని వ్యవస్థల్లోనూ ఇదే విధంగా ఉంది. మీడియాను నిలువరించేందుకు ప్రత్యేక జీవో తీసుకువచ్చారు. మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. చీఫ్ రిపోర్టర్లను బెదిరించడం, మీడియా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం, ఇవాళ టీవీ 5 కార్యాలయంపై దాడికి పాల్పడి అద్దాలు పగులగొట్టారు. మొత్తం ఆఫీసును తగులబెట్టాలని చూశారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా. నియంతపాలన సాగుతోంది. టీవీ 5పై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దొంగ జీవోను తీసుకువచ్చి పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
          నవరత్నాలని ఊదరగొట్టిన వైసీపీ.. ఏ రత్నం కూడా ప్రజలకు పూర్తిగా ఇవ్వకుండా దగా చేసింది. కాపు సామాజికవర్గానికి టీడీపీ మొట్టమొదటిసారిగా కాపు కార్పోరేషన్ ఏర్పాటుచేసి 3వేల కోట్లు వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.2వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీ ఇచ్చిన జగన్..నేడు ఏడాది పూర్తవుతున్నా.. కార్పోరేషన్ కు వెయ్యి రూపాయలు కూడా మంజూరు చేయలేదు. కాపు మహిళలకు రూ.15వేలు ఖాతాల్లో వేస్తామన్నారు. కోటి మంది మహిళలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు నెలలుగా జగన్ అసమర్థత వల్ల పేదలు పస్తులు ఉంటున్నారు. వీరిని ఆదుకునేందుకు మనసు రాలేదు. మరోవైపు కావాల్సిన కాంట్రాక్టర్లకు వేలకోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. జే-ట్యాక్స్ కోసం మద్యం షాపులు తెరిచారు. 30వేల కోట్ల ఆదాయం వస్తున్నా.. కాపులను ఆదుకునేందుకు చేతులు రావడం లేదు. కాపు మహిళలు రెండు నెలల నుంచి పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి కులానికి కార్పోరేషన్ ఏర్పాటుచేసి, నిధులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన జగన్.. మాట తప్పారు. బ్రాహ్మణులకు గత టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. జగన్ ఏడాది గడిచినా బ్రాహ్మణ కార్పోరేషన్ కు రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. నేడు పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణులు పస్తులుంటున్నారు. పేద బ్రాహ్మణులకు రూ.5వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంద కండిషన్లు పెట్టారు. బీసీ కార్పోరేషన్ కు చంద్రబాబు అత్యధిక నిధులు మంజూరు చేస్తే.. నేడు జగన్ బీసీ కార్పోరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల కోసం బీసీ సోదరులు ఎదురుచూస్తున్నారు. కాపులను, బీసీలను, బ్రాహ్మణులను నాశనం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు ఒక్కరికి కూడా సాయం చేయలేదు. పనుల్లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.  ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా. ఎస్సీ కార్పోరేషన్ నుంచి ఏడాది కాలంగా ఒక్కరికి కూడా సాయం చేయలేదు. ముస్లీం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చింది. ఇప్పడవేమీ లేవు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను కూడా రద్దు చేశారు. జగన్ కు కమీషన్లు వచ్చేవాటి కోసం నిధుల లోటు లేకుండా చూసుకుంటున్నారు. కేంద్ర నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు. జగన్ చుట్టూ తిరిగే పదిమంది రెడ్లకు తప్ప అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. హామీ ఇచ్చిన విధంగా కోటి మంది కాపు మహిళలకు తక్షణమే రూ.15వేల సాయం అందించాలి. బ్రాహ్మణులకు గత టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను పునరుద్ధరించాలి. బీసీ కార్పోరేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలి. పాస్టర్లకు జగన్ రూ.5వేలు ఇవ్వడం లేదు. ఎస్సీ,ఎస్టీలను జగన్ ఆదుకోవాలి. రజకులకు, టైలర్లకు సాయం చేస్తామని చెప్పి మాట తప్పారు.  ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్ ఏడాది పాలనలో ఏ ఒక్క సామాజికవర్గం అయినా బాగుపడ్డారా అని ప్రశ్నిస్తున్నా. ఏడాది కాలంగా రాష్ట్రానికి దరిద్రం పట్టింది.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image