విద్యా సంస్థలు ప్రారంభించిన తరువాత ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్దులను సైతం 28 రోజుల క్వారంటైన్  తరువాత మాత్రమే  హాస్టల్స్ లోకి అనుమతించేలా  చర్యలు తీసుకోవాలన్నారు

-గుంటూరు, మే 11-2020 :-  జిల్లాలో  లాక్ డౌన్ తొలగించిన  తరువాత ఇతర ప్రాంతాల వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నా,  కరోనా వైరస్ వ్యాప్తి  నియంత్రణలో వుండేలా అవసరమైన ప్రణాళికలు ముందస్తుగానే సిద్దంగా వుంచుకోవాలని కేంద్ర  బృంద సభ్యురాలు, అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.బాబి పాల్ జిల్లా యంత్రాంగానికి సూచించారు. 
  సోమవారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కేంద్ర బృందం  నుండి వచ్చిన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. బాబి పాల్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్                        డా. నందిని భట్టాచార్య, జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్, అడిషనల్ డి జి ఉజ్వల్ త్రిపాఠి, గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయారావు లతో సమావేశం అయ్యారు.  జిల్లాలో గత మూడు రోజులుగా డా. బాబి పాల్, డా. నందిని భట్టాచార్య క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించిన అంశాలు  కంటైన్మేంట్ క్లస్టర్లు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ -19 ఆసుపత్రులు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అమలు చేస్తున్న ముందస్తు జాగ్రత్త చర్యలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. కంటైన్మేంట్ క్లస్టర్లలో సరుకులు డోర్ డెలివరీ చేయడం మంచి విషయమన్నారు. క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలలో మెరుగైన వసతులతో పాటు, మంచి భోజనం అందిస్తున్నారన్నారు.  హాస్పిటల్  ప్రిపరేషన్ కు సంబంధించి సివియర్ లక్షణాలున్న పాజిటివ్ వ్యక్తులతో పాటు, మైల్డ్, అసలు లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తుల చికిత్స, ఐసోలేషన్ కు సంబంధించి మరిన్ని వార్డులు సిద్దంగా వుంచాలన్నారు.  విద్యా సంస్థలు ప్రారంభించిన తరువాత ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్దులను సైతం 28 రోజుల క్వారంటైన్  తరువాత మాత్రమే  హాస్టల్స్ లోకి అనుమతించేలా  చర్యలు తీసుకోవాలన్నారు.  కంటైన్మేంట్ జోన్ల పరిధి అవకాశం ఉన్నంత వరకు  తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, దీని వలన ఇతర ప్రాంతాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు.   ఆసుపత్రులలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన  అన్ని జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని వారు సూచించారు. 
 ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి,  జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. యాస్మిన్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా అనురాధ  తదితరులు పాల్గొన్నారు.  


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image