ఆపన్నహస్తం కోసం అభాగ్యుల ఎదురుచూపు

ఆపన్నహస్తం కోసం అభాగ్యుల ఎదురుచూపు
 ఉదయగిరి లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ వాసులు
 ఉదయగిరి. ప్రాణాంతక కరోనా వైరస్ సోకితే చనిపోవడం మా బతకడమా తర్వాత విషయం కానీ పట్టెడన్నం పెట్టే దిక్కు లేక, భాష రాక, ఎవరిని కలవాలో తెలియక, ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రతి క్షణం ఒక యుగంలా పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు వలస కూలీలు పశ్చిమ బెంగాల్ నుంచి పొట్ట చేత పట్టుకొని కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు సరిచేసే వలస కార్మికులు ఉదయగిరి ప్రాంతానికి వచ్చారు. వారిని తీసుకు వచ్చిన మేస్త్రీలు ఎక్కడి వాళ్ళు అక్కడ వదిలేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు కానీ వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు సుమారు 12 మంది పశ్చిమబెంగాల్ వాసులు ఉదయగిరి మండలం గుడి నర్వా గ్రామంలో తలదాచుకుంటున్నారు. అక్కడ పశువుల పాకలో పనిచేసే ఒక కుర్రవాడి దగ్గరికి వీరు అతి కష్టం మీద చేరుకొన్నారు. గత వారం రోజులుగా తిండి లేక నాన్న వాళ్లతో ఫోన్ లో మాట్లాడుకునే సౌకర్యం కూడా లేక నిత్య నరకం అనుభవిస్తున్నారు ఈ వలస కూలీలు. అధికారుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే అన్నం పెట్టడం మా డ్యూటీ కాదు అనుమతి మాత్రం తీసుకుని మిమ్మల్ని పంపిస్తాం  అని చెప్పడంతో ఎప్పుడు అనుమతి వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. భాష చేతకాక పోవడంతో అన్నం పెట్టమని అడుక్కునే స్థాయిలో కూడా వాడలేక పోవడం చూపరులను కలిచివేస్తోంది ఉన్నతాధికారులు తక్షణం స్పందించి వారికి అనుమతి ఇచ్చి వారి ప్రాంతానికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దాతలు కూడా ఎవరైనా స్పందించి వారికి అంత అన్నం పెట్టి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకుంటున్నారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image