చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వమే అధికంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది : వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి

గుంటూరు 
     10-05-2020.


 ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. దశల వారీ మద్య నిషేధం లో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీ మద్యపానం తో కలిగే నష్టాలను ప్రజలకు వివరించడం తో పాటు మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. అక్రమ మద్యం తయారీ దారులు, రవాణా దారులపై గట్టి నిఘా తో పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తుంది. గడచిన నాలుగేళ్ల తో పోలిస్తే చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వమే అధికంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది వాటి వివరాలు ఇలా ఉన్నాయి.


    2017 లో మొత్తం 3,812 కేసులు నమోదు కాగా 2018 లో 3,579 కేసులు నమోదు చేసింది. 2019లో 5,422 కేసులు నమోదు చేయగా 2020లో నేటికీ ఏకంగా 7,812 కేసులు నమోదయ్యాయి. ఇక,  అరెస్టు చేసిన వారి వివరాల్లోకొస్తే 2017 లో 2,487 మంది, 2018లో 2,763 మంది, 2019లో 3,526 మంది అరెస్ట్ కాగా 2020లో నేటికీ 5,870 మందిని ప్రస్తుత ప్రభుత్వం అరెస్టు చేసింది. నాటు సారా తయారీ పై దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న మద్యం 2017 లో 30,084 లీటర్లు కాగా,  2018లో 34,540 లీటర్లు, 2019లో 56,179 లీటర్లు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2020లో నేటికీ 97,482 లీటర్ల సారా ను  స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు నాశనం చేసిన బెల్లం ఊట సైతం ఈ ఏడాదిలోనే అధిక మొత్తం రికార్డుయింది. సీజ్ చేసిన వాహనాల వివరాల్లోకి వస్తే 2017 లో 191 వాహనాలు సీజ్ చేయగా.. 2018లో 188.. 2019లో 330 వాహనాలున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2020లో నేటికీ సీజ్ చేసిన వాహనాల సంఖ్య 1,541 గా రికార్డు అయింది. ఈ గణాంకాల ప్రకారం మద్య నియంత్రణ,  నాటుసారా తయారీ,అక్రమ రవాణాలపై వైయస్సార్సీపి ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచడంతో పాటు వాటికి అనుబంధంగా గుడి, బడి వంటి  ప్రదశాలల్లో  ఎక్కడ బడితే అక్కడ బెల్టుషాపులు విస్తరించి మద్యం  ఏరులా ప్రవహింపజేసారు. నేడు అలాంటి వాతావరణం లేకుండా పూర్తి కట్టుదిట్టమైన చర్యలతో దశలవారీ మద్యనిషేధ ఆచరణాత్మక ప్రణాళికను అమలు చేస్తున్నారు. క్రిందటి నెల( ఏప్రిల్ 22 నుంచి) కోవిడ్  లాక్ డౌన్ ప్రారంభం నుంచి మద్యం దుకాణాలు తెరిచిన  రోజు వరకు మద్యం అక్రమ తయారీ,  రవాణా పై ప్రత్యేక టీమ్ లు  నిఘా ఉంచాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,462 కేసులు నమోదు చేయగా, 1,282 మందిని అరెస్టు చేశారు. 14,759 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 3, 63,430 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేసి 12,718 కిలోల నల్ల బెల్లన్ని, 428 బైకులను సీజ్ చేశారు. మద్య విమోచన ప్రచార కమిటీ ఎప్పటికప్పుడు ఆయా మద్య నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తుండగా, గ్రామ, వార్డు వాలంటీర్లతో పాటు గ్రామాల్లో నియమించిన మహిళా మిత్రాలు, మహిళా రక్షక్ ల సేవలను కూడా వినియోగించుకుంటూ అక్రమ మద్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. పక్క రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ అక్రమ మద్యం తయారీ,నిల్వ దారులపై సంయుక్తంగా ప్రభుత్వం దాడులు జరుపుతోంది. మద్యం వినియోగం గణనీయంగా తగ్గించేందుకే  ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపుల సంఖ్య 33 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తద్వారా మద్యం షాపులు 4380 నుంచి ఈనెలఖరు  నాటికి కేవలం 2934 మాత్రమే పరిమితమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లను కూడా 40 శాతం తగ్గింపుతో మొత్తం 840 బార్లకు గాను530కి  తగ్గాయి. మద్యం ధరల పెంపుతో వినియోగాన్ని తగ్గించాలనే  ప్రభుత్వ సూత్రం సానుకూల ఫలితాలిస్తోoది.  చంద్రబాబు హయాంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లా తెరిచే  మద్యం దుకాణాల తలుపులను ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 11 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు మూసేస్తుంది. పైగా ఒక వ్యక్తికి గరిష్టంగా  లిక్కర్ లేదా బీరు కేవలం మూడు  సీసాల వరకే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టింది. అంతకుమించి కొనుగోలు చేసినా  అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.షాపుల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్ లను రద్దు చేసింది. ప్రభుత్వం తాజాగా మద్యం అక్రమ తయారీ,రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం సర్వత్రా స్వాగతించాల్సిన విషయం. మద్యం వినియోగాన్ని రాన్రానూ తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలనే నిర్ణయంతో ప్రభుత్వం అడుగులేస్తోందనే అనే సత్యాన్ని ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు గుర్తించాలి. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరు శాతం మద్యం దుకాణాలను ఎత్తివేసి 2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఈ మహా సంకల్పాన్ని  విజయవంతం చేయడమనేది సామాజిక బాధ్యతగా స్వీకరించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మేధావులు,సహకరించాలి.


      వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి
            రాష్ట్ర చైర్మన్
మద్య విమోచన ప్రచార కమిటీ
        ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
          99499 30670.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image