కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలపాలి. ;కడపజిల్లా కలెక్టర్ CH హరి కిరణ్

కడప, మే 10 (అంతిమ తీర్పు) :


తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలపాలని కడపజిల్లా కలెక్టర్ CH హరి కిరణ్ ఒక ప్రకటన లో తెలిపారు.
తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుండి లారి లలో పండ్లు కూరగాయలు తీసుకొని కడపజిల్లా వచ్చిన హోల్ సేల్ వ్యాపారులు, రిటైలర్లు పండ్లు ,కూరగాయలు లారీలలో నింపడం మరియు దించడం చేసే హమాలి కూలీలు ఎవరైనా వస్తే వెంటనే జిల్లాలో ని కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ,08562 245259, 259179 నెంబర్లు కు ఫొన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ CH  హరి కిరణ్ తెలిపారు.అలాంటి వారిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి ఫాతిమా మెడికల్ కాలేజ్ కి గాని లేదా జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు కు వచ్చి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి గా చేయించుకోవాలన్నారు. లేదా వారికి అందుబాటులో గాని  దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ ను గాని సంప్రదించాలన్నారు. వ్యాపార నిమిత్తం వచ్చేవారికి పక్క జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు.దీని దృష్ట్యా కోయంబేడు నుంచి కడప కు,కడప నుండి కోయంబేడు కు వ్యాపారం కోసం  వెళ్లి వచ్చే హోల్ సేల్, రిటైల్,హమాళిలు అందరూ తప్పనిసరిగా ఈ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ CH  హరి కిరణ్ ఒక ప్రకటన లో తెలిపారు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image