అమర బ్రదర్స్ సహకారంతో. భోజన ప్యాకెట్లు పంపిణీ : వైసీపీ నాయకుడు అమర యాదగిరి గుప్తా

కావలి,మే 8 (అంతిమ తీర్పు):


శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపిన ప్రకారంగా పది వ  వార్డులో ఇందిరమ్మ కాలనీలోని నూటా యాభై మందికి పేదలకు  అమర బ్రదర్స్ నిధులతో భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని వైసీపీ నాయకుడు అమర యాదగిరి గుప్తా తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కరోనా మహమ్మారి వలన పేద ప్రజలు పనులులేక దుర్భర జీవితం బతుకుతున్నారని ,ఈ లాంటి సమయంలో  వారికి చేయూత నివ్వడం  ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్  పేరం వెంకటేశ్వర్లు  , 33 వ వార్డు వైసీపీ నాయకులు పట్నం శివ , కాసా విజయ్ , ఇన్నమూరి సతీష్కుమార్,  పైడా లక్ష్మీపతి ఓలేటి  రాము , బొగ్గవరపు స్వామి , బొగ్గవరపు శ్రావణ్ , పెసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image