సేవా దృక్పథంతో ప్రజల వద్దకే వెళ్లి సేవలు చేస్తున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు ..

సేవా దృక్పథంతో ప్రజల వద్దకే వెళ్లి సేవలు చేస్తున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు .....


కావలి ,మే 11(అంతిమ తీర్పు- N. సాయి )
 
       కావలి పట్టణం లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు పారిశుధ్య కార్మికులకు ఉదయం టిఫిన్ ప్యాకెట్లు పంపిణీ చేసి  పోలీసు సిబ్బందికి మంచినీటి సదుపాయం కోసం 10 కూలింగ్ వాటర్ క్యాన్ లు ఏర్పాటు చేయడ‌మే కాకుండా  మధ్యాహ్నం 150 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని వ్యవస్థాపకుడు సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయు మాట్లాడుతూ రవి ప్రకాష్  మరియు రామకృష్ణ సంయుక్త సేవా సంస్థ ద్వారా కావలి  పట్టణం నందు  విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు టిఫిన్  ప్యాకెట్లు,మంచినీరు పంపిణీ చేయడమే కాకుండా మధ్యాహ్నం 150 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు . సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభం నుంచి నేటికీ 50 రోజులుగా మా సేవలు కొనసాగిస్తూ  సంస్థ కు సహకరించిన ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసాద్ , నేలటూరి శివప్రసాద్ రెడ్డి ,గనీ భాష ,వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image