ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి  వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి 
వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ


విజయవాడ,మే 10,(అంతిమ తీర్పు):


కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకొని ఆహారం అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఓంకార్ సేవా సమితి అధ్యక్షుడు గండే సాంబశివరావు అన్నారు కరోనా కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టాలని దానిగాను ప్రజలు ప్రభుత్వం, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు బౌతిక దూరంతో కరోనాని దూరం చేయవచ్చు అని సాంబశివరావు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం జరిగిన అల్పాహారం పంపిణీ గుళ్లపల్లి బూర్లమ్మ డొంక ,ఆరేపల్లి కాలనీ ప్రాంతాల్లో వలస కార్మికుల చిన్న పిల్లలకు వందలాది మందికి ఇడ్లీ పొట్లాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, సేవ సమితి సభ్యులు తూనుగుంట్ల శ్రీనివాసరావు, కేసన సాంబశివరావు, సీతారామయ్య, కుమార్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగానిర్విరామంగా సాగుతున్న ఆహార పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని సేవా సమితి అధ్యక్షుడు తెలిపారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు