జిల్లాలో కరోనా కలకలం ఎమ్మిగనూరు లో తొలి కరోనా కేసు నమోదు

జిల్లాలో కరోనా కలకలం ఎమ్మిగనూరు లో తొలి కరోనా కేసు నమోదు


ఎమ్మిగనూరు, మే,16 (అంతిమతీర్పు-జి. మోహన్ రెడ్డి):-కరోనా మహమ్మారి ఎమ్మిగనూరు పట్టణానికి తాకింది. శనివారం కర్నూలు జిల్లాలో విడుదల చేసిన కరోనా  పాజిటివ్ కేసుల బులిటెన్ లో ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య కొట్టాల ( పెద్దకమేళ) 1, మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రం లో 2, కౌతాలం లో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య కొట్టాల కు చెందిన ఓ లారీ డ్రైవర్ (40) కు జ్వరం తీవ్రంగా ఉండేది. గత 5రోజుల క్రితం ఆ డ్రైవర్ ను ఐసులేషన్ కు తరలించి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ప్రభుత్వం  విడుదల చేసిన బులిటెన్ లో ఇతనికి పాజిటివ్ గా వచ్చినట్లు ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనరు జి.రఘునాథ్ రెడ్డి శనివారంవిలేకరులకు  తెలిపారు. డ్రైవర్ తో కలీసిన మరో 12 మందిని బనవాసి ఫారంలోని క్వరంటైన్ కు పంపారు. లారీ డ్రైవర్ గత 20 రోజుల పాటు చెనై లోని కోయమ్బేడు మార్కెట్ కు వెళ్లి వచ్చినట్లు సమాచారం. డ్రైవర్  తల్లితో పాటు ఎమ్మిగనూరు లో  నివాసం ఉంటున్నారు. ఇతని బార్య పిల్లలు కర్నాటక లో ఉంటున్నారు. ఇన్ని రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణంలో  పాజిటివ్  కేసు రావడంతో ప్రజలు అందోళనకు గురి అవుతున్నారు.అలాగే మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి మండలంలో 2,కౌతాళం మండలం లో ఒకటి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలంతా  ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు  తహశీల్దార్ వెంకటేశ్వర్లు,
 మున్సిపల్ కమీషనరు రఘునాథ్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్,ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ డి.బాలయ్య  చంద్రయ్య కొట్టాల వీధికి వెళ్లి పరిసరాలను శుభ్రపరిచారు


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image