జిల్లాలో కరోనా కలకలం ఎమ్మిగనూరు లో తొలి కరోనా కేసు నమోదు

జిల్లాలో కరోనా కలకలం ఎమ్మిగనూరు లో తొలి కరోనా కేసు నమోదు


ఎమ్మిగనూరు, మే,16 (అంతిమతీర్పు-జి. మోహన్ రెడ్డి):-కరోనా మహమ్మారి ఎమ్మిగనూరు పట్టణానికి తాకింది. శనివారం కర్నూలు జిల్లాలో విడుదల చేసిన కరోనా  పాజిటివ్ కేసుల బులిటెన్ లో ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య కొట్టాల ( పెద్దకమేళ) 1, మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రం లో 2, కౌతాలం లో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య కొట్టాల కు చెందిన ఓ లారీ డ్రైవర్ (40) కు జ్వరం తీవ్రంగా ఉండేది. గత 5రోజుల క్రితం ఆ డ్రైవర్ ను ఐసులేషన్ కు తరలించి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ప్రభుత్వం  విడుదల చేసిన బులిటెన్ లో ఇతనికి పాజిటివ్ గా వచ్చినట్లు ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనరు జి.రఘునాథ్ రెడ్డి శనివారంవిలేకరులకు  తెలిపారు. డ్రైవర్ తో కలీసిన మరో 12 మందిని బనవాసి ఫారంలోని క్వరంటైన్ కు పంపారు. లారీ డ్రైవర్ గత 20 రోజుల పాటు చెనై లోని కోయమ్బేడు మార్కెట్ కు వెళ్లి వచ్చినట్లు సమాచారం. డ్రైవర్  తల్లితో పాటు ఎమ్మిగనూరు లో  నివాసం ఉంటున్నారు. ఇతని బార్య పిల్లలు కర్నాటక లో ఉంటున్నారు. ఇన్ని రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణంలో  పాజిటివ్  కేసు రావడంతో ప్రజలు అందోళనకు గురి అవుతున్నారు.అలాగే మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి మండలంలో 2,కౌతాళం మండలం లో ఒకటి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలంతా  ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు  తహశీల్దార్ వెంకటేశ్వర్లు,
 మున్సిపల్ కమీషనరు రఘునాథ్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్,ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ డి.బాలయ్య  చంద్రయ్య కొట్టాల వీధికి వెళ్లి పరిసరాలను శుభ్రపరిచారు