పొగాకు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించిన మంత్రి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 09-05-2020,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.


పొగాకు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించిన మంత్రి గౌతమ్ రెడ్డి


*  పొగాకు కొనుగోళ్ల పున:ప్రారంభానికి చొరవచూపిన మంత్రి


* కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్, పొగాకు అధికారులకు ఆదేశం


*  రైతులు, బోర్డు అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచన



శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మే, 09; కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయి ఆందోళన చెందుతున్న పొగాకు రైతులను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గట్టెక్కించారు. రోజురోజుకి రంగుమారి, కొనుగోలు జరుగుతుందో లేదోనని మొరపెట్టుకున్న రైతుల కష్టం విని చలించిపోయారు. తాజాగా జిల్లా  అధికార యంత్రాంగంతో ఈ అంశంపై చర్చించినా కరోనా పాజిటివ్ కేసులు, పొగాకు బోర్డు ఉన్న మర్రిపాడు మండలంలోని డీసి పల్లి  ప్రాంతం రెడ్ జోన్ కావడంతో కొనుగోలు ప్రారంభం కుదరలేదు. తాజాగా మంత్రి గౌతమ్ రెడ్డి టొబాకో బోర్డు అధికారులతో చర్చించడంతో పాటు, జిల్లా కలెక్టర్ కు పొగాకు కొనుగోళ్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో శరవేగంగా శుక్రవారం ఎం.వీ శేషగిరి బాబు జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాలైన డీసీ పల్లి, కలిగిరిలను గ్రీన్ జోన్ గా ప్రకటించి పొగాకు కొనుగోళ్లు  మే నెల 11వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించాలని మార్గదర్శకాలిచ్చారు. సుమారు 45 రోజులుగా లాక్ డౌన్ కారణంగా పొగాకు కొనుగోళ్లు ఎక్కడికక్కడ  నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తుల అంశంలో వెసులుబాటు కలిగించడం, డీసీ పల్లిలోని పాజిటివ్ కేసులు నెగటివ్ గా మారడం, మర్రిపాడు ప్రాంతం గ్రీన్ జోన్ పరిధిలోకి రావడంతో మంత్రి గౌతమ్ రెడ్డి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వడం పొగాకు రైతుల్లో కొండంత భరోసా నింపింది. అయితే, పొగాకు కొనుగోళ్ల సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా రైతులు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. వాక్సిన్ వచ్చేవరకూ ఈ జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించడం అలవాటు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని, రైతులందరి పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


*


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
స‌మాజ చైత‌న్య‌మే మ‌న ఆయుధం కావాలి... * ఎస్‌జెఆర్‌వో తొలి రాష్ట్ర స్థాయి స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపు విజ‌య‌వాడ‌: నిత్య జీవితంలో ప్ర‌జ‌లు ఎదు‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం కోసం సంస్థ స‌భ్యులంద‌రూ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని సోష‌ల్ జ‌స్టిస్ రైట్ ఫ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్‌జెఆర్‌వో) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు పిలుపునిచ్చారు. ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర స్థాయి తొలి ఎగ్జిక్యూటీవ్ స‌మావేశాన్ని శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జ‌‌క్కా సాయిబాబు మాట్లాడుతూ ఆర్థిక‌, సామాజిక, రాజ‌కీయ వ్య‌వ‌స్థల్లో ‌జ‌రుగుతున్న అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతం కార‌ణంగా న‌ష్ట‌పోతున్న పౌరుల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెలుగులోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా సామాజిక బాధ్య‌త‌గా భావించి సంస్థ స‌భ్యులు ప‌నిచేయాల‌ని కోరారు. స‌మాజంలో మార్పు రావాల‌ని కోరుకునే ప్ర‌తి వ్య‌క్తిని గుర్తించి వారితో క‌లిసి ప‌నిచేయ‌డం సంస్థ ల‌క్ష్యాల్లో ఒక‌ట‌ని పేర్కొన్నారు. స‌మాజంలో పెరిగిపోతున్న కాలుష్యం, త‌గ్గిపోతున్న నైతిక విలువ‌లు, ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో వ‌స్తున్న మార్పులు వంటి అంశాల‌పై స‌భ్యులు నిరంత‌రం గుర్తుచేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సామాన్య పౌరుల‌ను క‌లుపుకుని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా వారి ప‌రిష్కారం సులువవు‌తుంద‌న్నారు. 7 ద‌శాబ్ధాల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా ప‌నిచేసిన స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వానికి ముందుగా స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ‌జాతిపిత మ‌హాత్మా‌గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించి అనంత‌రం జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా సంస్థ స‌భ్యుల‌కు గుర్తింపు కార్డులు అంద‌జేసి సంస్థ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా సేవ‌లందిస్తామ‌ని ప్ర‌మాణం చేయించారు. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం గ్రో గ్రీన్‌, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి మ‌నిషిలా జీవించాల‌ని కోరారు. స‌మావేశానికి ఎస్‌జెఆర్‌వో మ‌హిళా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాస‌రి ధాత్రి అధ్య‌క్ష‌త వ‌హించ‌గా కృష్ణా జిల్లా అధ్య‌క్ష‌, ప్రధాన కార్య‌ద‌ర్శులు చెన్నాప్ర‌గ‌ఢ ప్ర‌సాద్‌, కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌, మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు కె.భాగ్య‌ల‌క్ష్మీ, వివిధ జిల్లాల నుంచి సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.