సబ్బులు, శానిటైజర్ల కొనుగోలుకు అంగన్‌వాడీ నిధుల వినియోగానికి వెసులుబాటు: డాక్టర్ కృతికా శుక్లా

రెండు విడతలుగా పోషకాహార పంపిణీ 
* సబ్బులు, శానిటైజర్ల కొనుగోలుకు అంగన్‌వాడీ నిధుల వినియోగానికి వెసులుబాటు
* లాక్‌డౌన్ ముగిసిన తదుపరి ప్రస్తుత కాలానికి సమాజిక తనిఖీ తప్పనిసరి 
* రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా 
విజ‌య‌వాడ‌: అంగన్ ‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార కార్యక్రమాన్ని మే నెలలో రెండు విడతలుగా అందించటం జరగుతుందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నిరంతర పొడిగింపు నేపధ్యంలో ప్రభుత్వ అదేశాల మేరకు 6 నుండి 36 నెలలు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఆరవతేదీ లోపు ఒక విడత, మే 17,18 తేదీలలో రెండవ విడత రేషన్ పంపిణీ చేయనున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చిన్నారులు, గర్బీణీలు, బాలింతలు ఎటువంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యచరణతో ముందుకు సాగుతుందన్నారు. కరోనా నేపధ్యంలో అంగన్ వాడీ కార్యకర్త రేషన్ ఇచ్చే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసి ఉండగా, సబ్బులు, శానిటైజర్లు కొనుక్కోడానికి ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిధులను ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని పంపిణీ చేయాలని ఆదేశించామని, ఎటువంటి అవకతవకలకు అస్కారం లేకుండా వలస కుటుంబాలలోని లబ్ధిదారులకు అందించిన రేషన్ వివరాలను సైతం రికార్డు చేయవలసి ఉంటుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో అందించిన సేవలపై లాక్ డౌన్ ఎత్తివేసిన తదుపరి సోషల్ అడిట్ నిర్వహిస్తామని ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని డాక్డర్ కృతికా శుక్లా హెచ్చరించారు. ఇంటివద్దనే రేషన్ తీసుకున్న లబ్ధిదారుల హాజరును సిఎఎస్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేసేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సీ.డీ.పీ.ఓ. లు తగు చర్యలు తీసుకోవాలని,  టేక్ హోమ్ రేషన్ ఎన్ని రోజులకి ఇచ్చారో అన్ని రోజుల హాజరును ప్రతీ లభ్డిదారుని సిఎఎస్ లో నమోదు చేసేలా స్పష్టపరిచామన్నారు. అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం అంతా జిల్లా పరిపాలన అధికారి పర్యవేక్షణలో జరగవలసి ఉండగా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు వారితో సమన్వయం చేసుకొని అంగన్ వాడీ కేంద్రాలకు నిర్దేశించిన సరుకులు, గుడ్లు, పాలు తాజావి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. 
                                     లబ్దిదారులు పోషకాహార వినియోగంలో ఎటువంటి అంతరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల్లో అయా ప్రాంతాలను గ్రీన్/ఆరెంజ్/రెడ్ జోన్లుగా గుర్తించడం వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా పరిపాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవలసి ఉంటుందని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సోమవారం నుండి మే 31 వరకు 23 రోజులకు గాను రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 6-36 ,  36-72 నెలల పిల్లలు, గర్భిణీ, బాలింతలకు బియ్యం, కందిపప్పు, నూనె ఒకే సారి అందచేస్తారని, తాజా కోడిగుడ్లు, పాలు మాత్రం రెండు దఫాలుగా ఇవ్వనున్నారని వివరించారు. సాధారణ అనుబంధ పోషకాహారం కార్యక్రమం క్రింద గర్బిణీ, బాలింతలకు బియ్యం 3 కిలోలు, కందిపప్పు కిలో, నూనే అరకిలో, గుడ్లు 11, రెండు లీటర్ల పాలు మొదటి విడతగా, 12 గుడ్లు, రెండు లీటర్ల పాలు రెండో విడతగా అందచేస్తారని పేర్కొన్నారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు బియ్యం రెండు కిలోలు, కందిపప్పు అరకిలో, నూనె 250 గ్రాములు, 11 గుడ్డుల మొదటి విడతలో, 12 గుడ్లు రెండో విడతలో అందిస్తారని సంచాలకులు పేర్కొన్నారు. 6-36 నెలల పిల్లలకు మొదటి విడతలో 2.5 కిలోల బాలామృతం, ఎనిమిది గుడ్లు అందించనుండగా, మరోవైపు బాల సంజీవని కార్యక్రమం క్రింద తొలి విడతలో మూడు గుడ్లు, లీటరు పాలు, తుది విడతలో 12 గుడ్లు, లీటరు పాలు పంపిణీ చేయనున్నారు. అదే క్రమంలో బాల సంజీవని కార్యక్రమం క్రింద మూడు నుండి ఆరేళ్ల చిన్నారులకు తొలి విడతలో లీటరు, మలి విడతలో మరో లీటరు పాలు అందిస్తారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా 77 మండలాలలో ఆరు నుండి 36 నెలల పిల్లలకు తొలి విడతగా 14 గుడ్లు, 3 లీటర్ల పాలు, మలి విడతలో 14 గుడ్లు, 3.6 లీటర్ల పాలు అందించనున్నారని డాక్డర్ కృతికా శుక్లా తెలిపారు. ఇదే పధకం కింద మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు తొలి విడత రెండు, మలి విడతలో 2.6 లీటర్ల పాలు పంపిణీ చేస్తారు. వైఎస్ఆర్  సంపూర్ణ పోషణ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలకు  ఇవ్వాల్సిన అదనపు పోషకాహారం వారానికొకసారి అందించాలని ఆదేశించామని, బాల సంజీవని కార్యక్రమం క్రింద  రక్తహీనత/హై రిస్క్ గర్భిణీ, బాలింతలకు అందరికీ అందిస్తారన్నారు. కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా టేక్ హోమ్ రేషన్ పంపిణీ మహిళా సంరక్షణ కార్యదర్శి, ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్ పర్యవేక్షణలో అంగన్ వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందిస్తూ  కనీసం 6 అడుగుల దూరం తప్పకుండా పాటించాలని సూచించామన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image