ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతి మే 5 (అంతిమ తీర్పు) :


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.


గంటలు మోగించారు. దీపాలు వెలిగించారు. పూలు జల్లారు. ఇకపై తీర్థం ఇస్తున్నట్లుగా మద్యం  అమ్మకాలు ప్రారంభించారు.


కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలి.


మద్యం షాపుల వద్ద లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, వ్యక్తిగత దూరం గాని కనీసం మాస్కులు కూడా లేకుండా మందుబాబులు బారులుతీరి లైన్లో నిల్చున్నారు.


ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం తాపత్రయపడుతోంది.


కేంద్ర ప్రభుత్వం బుక్ స్టాల్స్  కు అనుమతులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు.


పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన దుస్థితి నెలకొనడం విచారకరం.
- రామకృష్ణ.