చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమేందుకు కూడా కొడాలి నాని పనికిరాడు బూతుల మంత్రీ ఒళ్లు దగ్గర పెట్టుకో -యరపతినేని శ్రీనివాసరావు


10.05.2020


చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమేందుకు కూడా కొడాలి నాని పనికిరాడు
బూతుల మంత్రీ ఒళ్లు దగ్గర పెట్టుకో
-యరపతినేని శ్రీనివాసరావు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, పద్దతి నిన్న మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలతో స్పష్టమైంది. బాద్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం, ఉపయోగించిన భాష అత్యంత హేయం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాద్యతాయుతంగా వ్యవహరించాలి. భాష పద్దతిగా ఉండాలి. అంతేగానీ మంత్రులుగా ఉంటూ బూతులు మాట్లాడడం సిగ్గుచేటు. మేం అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రతిపక్షం మా తప్పుల్ని ఎత్తిచూపుతూ దుర్మార్గంగా మాట్లాడారు. కానీ ఏనాడూ మేం నోరు జారలేదు, మాట తూలలేదు. కానీ వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గేస్తోంది. తాడేపల్లి నుండి ఫోన్ వస్తే మీడియా ముందుకు రావడం కుక్కలా మొరిగి ఇంట్లోకి వెళ్లి పడుకోవడం మాత్రమే కొడాలి నానికి తెలుసు.
లారీ క్లీనర్ గా ఉన్న కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు గారి గురించి ఈ రోజు అసభ్యంగా మాట్లాడడం తగదు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని మంత్రి. నీ శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలీదు. నీ శాఖకు సంబంధించి మరో మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే నీ స్థాయేంటో గుర్తించు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి ఉందా.? కొడాలి నానీ.. నువ్ మాట్లాడేది సరైనదేనా అని నీ మనస్సాక్సిని అడుగు. కొడాలి నాని లాంటి మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. వయసైపోయింది అంటున్న చంద్రబాబు గారు ఎలా పనిచేస్తున్నారో.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడిపారో.. యువ ముఖ్యమంత్రి అంటున్న జగన్ పనితీరు ఏంటో కొడాలి నాని బేరీజు వేసుకోవాలి. ఆయన శరీరానికి వయసైపోయిందేమో.. ఆలోచనలకు కాదని గుర్తుంచుకో. 
ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం కుమ్మక్కవ్వడం సిగ్గుచేటు. ప్రజల తిరుగుబాటుతో మంత్రులు ఎలా తిరుగుముఖం పట్టారో చూడండి. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి.. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రశ్నించిన ప్రజలపై కూడా తప్పుడు కేసులు పెడతారా.? గంజాయి, సారా, మట్టి, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని సాక్ష్యాత్తు స్పీకర్ చెప్పిన మాటలు మీకు వినిపించలేదా కొడాలి నానీ. మద్య నిషేధం పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వాటిపై 125శాతం ధరలు పెంచి దోచుకుంటున్నారు. 
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తించిన ప్రతిసారి ఈ బూతుల మంత్రి బయటకొచ్చి ఏదేదో మాట్లాడుతాడు. అక్షరం ముక్కరాని యదవలు మా ఎమ్మెల్యేల గురించి, చంద్రబాబు గారి గురించి ఏది పడితే అది మాట్లాడితే క్షమించేది లేదు.  చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే.. కొడాలి నాని సహా వైసీపీ నేతలందరికీ చెప్పులతో కొట్టే రోజు తప్పదని గుర్తుంచుకోండి. పద్దతిగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు తిరగబడితే మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించుకోండి. 
చంద్రబాబు నాయుడు గారి సలహాలను కేంద్ర ప్రభుత్వం కూడా కొనియాడింది. ఆ సలహాలు, సూచనలు నచ్చకుంటే మానుకోండి. అంతేగానీ పనికి మాలిన విమర్శలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేం బూతులు మాట్లాడలేమా.? తిట్టలేమా.? కానీ తెలుగుదేశం పార్టీకి పద్దతి, విధానం ఉంది. ఒకసారి ప్రజల్లోకి పదండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ప్రభుత్వ అసమర్ధత, చేతకాని తనం, మాఫియా, దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా, నియంతృత్వ పోకడలకుపోతే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని గుర్తుంచుకోండి.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image