చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమేందుకు కూడా కొడాలి నాని పనికిరాడు బూతుల మంత్రీ ఒళ్లు దగ్గర పెట్టుకో -యరపతినేని శ్రీనివాసరావు


10.05.2020


చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమేందుకు కూడా కొడాలి నాని పనికిరాడు
బూతుల మంత్రీ ఒళ్లు దగ్గర పెట్టుకో
-యరపతినేని శ్రీనివాసరావు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, పద్దతి నిన్న మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలతో స్పష్టమైంది. బాద్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం, ఉపయోగించిన భాష అత్యంత హేయం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాద్యతాయుతంగా వ్యవహరించాలి. భాష పద్దతిగా ఉండాలి. అంతేగానీ మంత్రులుగా ఉంటూ బూతులు మాట్లాడడం సిగ్గుచేటు. మేం అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రతిపక్షం మా తప్పుల్ని ఎత్తిచూపుతూ దుర్మార్గంగా మాట్లాడారు. కానీ ఏనాడూ మేం నోరు జారలేదు, మాట తూలలేదు. కానీ వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గేస్తోంది. తాడేపల్లి నుండి ఫోన్ వస్తే మీడియా ముందుకు రావడం కుక్కలా మొరిగి ఇంట్లోకి వెళ్లి పడుకోవడం మాత్రమే కొడాలి నానికి తెలుసు.
లారీ క్లీనర్ గా ఉన్న కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు గారి గురించి ఈ రోజు అసభ్యంగా మాట్లాడడం తగదు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని మంత్రి. నీ శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలీదు. నీ శాఖకు సంబంధించి మరో మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే నీ స్థాయేంటో గుర్తించు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి ఉందా.? కొడాలి నానీ.. నువ్ మాట్లాడేది సరైనదేనా అని నీ మనస్సాక్సిని అడుగు. కొడాలి నాని లాంటి మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. వయసైపోయింది అంటున్న చంద్రబాబు గారు ఎలా పనిచేస్తున్నారో.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడిపారో.. యువ ముఖ్యమంత్రి అంటున్న జగన్ పనితీరు ఏంటో కొడాలి నాని బేరీజు వేసుకోవాలి. ఆయన శరీరానికి వయసైపోయిందేమో.. ఆలోచనలకు కాదని గుర్తుంచుకో. 
ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం కుమ్మక్కవ్వడం సిగ్గుచేటు. ప్రజల తిరుగుబాటుతో మంత్రులు ఎలా తిరుగుముఖం పట్టారో చూడండి. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి.. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రశ్నించిన ప్రజలపై కూడా తప్పుడు కేసులు పెడతారా.? గంజాయి, సారా, మట్టి, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని సాక్ష్యాత్తు స్పీకర్ చెప్పిన మాటలు మీకు వినిపించలేదా కొడాలి నానీ. మద్య నిషేధం పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వాటిపై 125శాతం ధరలు పెంచి దోచుకుంటున్నారు. 
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తించిన ప్రతిసారి ఈ బూతుల మంత్రి బయటకొచ్చి ఏదేదో మాట్లాడుతాడు. అక్షరం ముక్కరాని యదవలు మా ఎమ్మెల్యేల గురించి, చంద్రబాబు గారి గురించి ఏది పడితే అది మాట్లాడితే క్షమించేది లేదు.  చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే.. కొడాలి నాని సహా వైసీపీ నేతలందరికీ చెప్పులతో కొట్టే రోజు తప్పదని గుర్తుంచుకోండి. పద్దతిగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు తిరగబడితే మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించుకోండి. 
చంద్రబాబు నాయుడు గారి సలహాలను కేంద్ర ప్రభుత్వం కూడా కొనియాడింది. ఆ సలహాలు, సూచనలు నచ్చకుంటే మానుకోండి. అంతేగానీ పనికి మాలిన విమర్శలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేం బూతులు మాట్లాడలేమా.? తిట్టలేమా.? కానీ తెలుగుదేశం పార్టీకి పద్దతి, విధానం ఉంది. ఒకసారి ప్రజల్లోకి పదండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ప్రభుత్వ అసమర్ధత, చేతకాని తనం, మాఫియా, దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా, నియంతృత్వ పోకడలకుపోతే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని గుర్తుంచుకోండి.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image