విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన హృదయ విదారకం :ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్

*విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన హృదయ విదారకం :ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): విశాఖపట్నం ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుండి విషతుల్య వాయువులు విడుదలై 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు శాపంగా మారడం దురదృష్టకరమని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ అన్నారు. విశాఖ దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎల్.జి పాలిమర్స్ ఘటనలో 8 మంది అమాయక ప్రజలు అశువులు బాయడం, వందల మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడం కడు భాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏ.బి.వి.పి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కౌశిక్ ఆకాం క్షించారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. లాక్ డౌన్ నిబంధనలను పరిశ్రమలో ప్రతిరోజూ మెయింటనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన పరిశ్రమలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంచడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో స్టైరెస్ లీక్ జరిగి మంటలు చెలరేగాయన్నారు. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెస్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెంది విపత్కర పరిస్థితులకు దారి తీసిందన్నారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకునే నాధులే కరువయ్యారని కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పట్ల, పర్యావరణం పరిరక్షణ పట్ల భాధ్యతగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అసలు మన రాష్ట్రంలో ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
 పరిశ్రమల నుండి విష రసాయనాలు, వ్యర్ధాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తుండటం అత్యంత హేయనీయమన్నారు. దుర్ఘటనలు జరిగినప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలు ప్రకటించడం, అనంతరం చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉంటున్న పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో వాటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భధ్రతా చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌశిక్ హితువు పలికారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image