మద్యం దుకాణాలు వద్ద ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించేలా చూడండి : సిఎస్

*మద్యం దుకాణాలు వద్ద ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించేలా చూడండి.


*5గురుకు మించి గుమికూడరాదు.


*వ్యవసాయ, పారిశ్రామిక, నిర్మాణ రంగాల పనులు లేని వారినే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించాలి.
            
*గ్రామాల్లో కమ్యునిటి క్వారంటైన్ కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలి: సిఎస్.


అమరావతి,4మే: వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగాల పనులు పూర్తయి వారి స్వంత జిల్లాలు లేదా రాష్ట్రాలకు వెళ్ళాలనుకునే కార్మికులను మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి జిల్లా లు రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, జెసిలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపధ్యంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో గతంలో వివిధ పనుల నిమిత్తం వెళ్ళి అక్కడ ఉండి పోవడం జరిగిందని కాని ఇప్పుడు అందరినీ అవసరం ఉన్నా లేకున్నా వారి స్వస్థలాలకు తరలించడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ ఆదేశాలలో స్పష్టం చేసిందని తెలిపారు. కావున ఎక్కడైతే వ్యవసాయ, నిర్మాణ, పారిశ్రామిక రంగ పనులు పూర్తయి నిలిచిపోయిన వారు స్వస్థలాలకు వెళ్ళాలనుకునే వారిని మాత్రమే ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ స్పష్టం చేశారు.


మద్యం దుకాణాలు వద్ద 5గురు వ్యక్తులకు మించి గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. అదేవిధంగా దుకాణాలు వద్ద భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.ఒక వేళ ఈవిధంగా పాటించకుంటే ఆయా మద్యం దుకాణాల తలుపులను మూసి మద్యం కోనుగోలుకు పెద్ద సంఖ్యలో గుమికూడిన వారిని చెదరగొట్టి భౌతిక దూరం పాటిస్తేనే అమ్మ కాలు జరపాలని ఈవిషయంలో ఎక్సైజ్,పోలిస్ అధికారులు చర్యలు తీసుకునేలా కలెక్టర్లు చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.


అలాగే వివిధ ప్రాంతాల నుండి ఆయా గ్రామాల వచ్చే వారిని ఉంచేందుకు ప్రతి గ్రామంలో 10పడకలతో ఏర్పాటు చేస్తున్న కమ్యునిటీ క్వారంటైన్ కేంద్రాలలో తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల కేంద్ర హోం శాఖ మార్గ దర్శకాలకు అనుగుణంగా సాధారణ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు.


కేసుల పాజిటివిటీ  రేషియో, కేసులు ఫెటాలిటీ రేషియో, వారం రోజుల వ్యవధిలో కేసుల డబిలింగ్ రేట్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‌


ఈవీడియో సమావేశంలో విజయవాడ ఆర్అండ్బి కార్యాలయం నుండి పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ క్లస్టర్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు మరికోన్ని తాజా ఆదేశాలను జారీ చేశామని వాటిని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు.


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు