ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో మాలవ్యనగర్ లో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ప్రగతి సేవ సంస్థ కార్యవర్గ సభ్యుడు అయినటువంటి  నెల్లూరు కార్పొరేషన్ లోని ఉద్యోగి రవికుమార్ సహాయ సహకారాలతో ఈరోజు 03.05.2020వ గూడూరు 2 టౌన్  లోని మాలవ్యనగర్ లోని సచివాలయం వాలంటీర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపల్ కార్మికులకు అయినటువంటి 50  కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిధి సేవాభావం కలిగిన వ్యక్తి మన సింహపురి రెడ్డి సంక్షేమ సంగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,ప్రజేంద్ర రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా, ఎం మస్తానయ్య,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.