నా మీద,తెలుగుదేశం నాయకులపైన నిన్న రాత్రి  అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. -రాజేంద్ర ప్రసాద్ mlc

ప్రెస్ మీట్ -- ఉయ్యురు -- 4-5-2020


* *రెడ్ జోన్ విజయవాడ నుంచి వచ్చిగ్రీన్ జోన్ ఉయ్యురు లో  తిరుగుతున్న mla సారధిని వదిలి నా మీద కేసులు పెట్టడం అన్యాయం -రాజేంద్ర ప్రసాద్ mlc* 


* *లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం రెడ్ జోన్ విజయవాడ నుంచి గ్రీన్ జోన్ ఉయ్యురు వస్తున్న సారథిని 15 రోజులు క్వారంటైన్ కి పంపాలి* 


 నా మీద,తెలుగుదేశం నాయకులపైన నిన్న రాత్రి  అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. -రాజేంద్ర ప్రసాద్ mlc*


2) పోలీసుల అక్రమ కేసులకు బయపడేదిలేదు. నిరంతరం ప్రజా సేవ చేస్తూనే ఉంటాం. 


3) CMRF సారథి ఇవ్వకపోతే మేం 20000 వేల రూపాయలు సహాయం చేశామని ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నామనే కేసులు కట్టారు. 


4) లాక్ డౌన్ వల్ల ఆకలితో అల్లాడుతున్న పేదలకు సహాయం చెయ్యడం నేరమా ? 


5) mla సారథి గారు 100 మంది ysr కార్యకర్తలతో ఉయ్యురులో రోజు తిరుగుతూ ప్రచారం చేస్తుంటే సారథి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? పైగా పోలీసులు కాపలాగా సారథి వెంట ఎందుకు తిరుగుతున్నారు? 


6) 7, 11 వార్డుల్లో మొన్న సారథి పోలీసు C i, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులను 100 మంది ysr కార్యకర్తలను వేసుకొని సారథి ప్రచారం చేసారు. దానికి C.i, కమిషనర్లే సాక్షం. మరి సారథి గారి మీద కేసు పెట్టారా? 


7) 4రోజుల క్రితం సారథి ఉయ్యురు సెంటర్లో అన్నదానం పేరుతో 500 మందిని పోగు చేస్తే, తొక్కిసలాట జరగలేదా? అది లాక్ డౌన్ ఉల్లంఘన క్రిందకు రాదా? సారథి మీద కేసు పెట్టారా? 


8) కరోనా కేసులు తీవ్రంగా వున్న రెడ్ జోన్ ఏరియా విజయవాడ నుంచి కేసులు లేని గ్రీన్ జోన్ ఏరియా మా ఉయ్యురుకు సారథి రోజు వచ్చి 100 మందితో తిరుగుతూ కరోనా వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారు. 


9) కనుక రెడ్ జోన్ విజయవాడ సిటీ నుంచి గ్రీన్ జోన్ ఉయ్యురు మున్సిపల్టి కి  వచ్చి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కరోనాని వ్యాప్తి చేస్తున్న సారథి పై వెంటనే కేసులు పెట్టాలని క్వారంటైన్ చెయ్యాలని పోలీసు కమిషర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. 


10) సారథి ఉయ్యురులో తిరిగినన్ని రోజులు నేను తిరుగుతూనే వుంటాను. ఇద్దరి మీద కేసులు పెట్టండి. పోలీసులు పక్షపాతం చూపిస్తే సహించం. 


11) రెడ్ జోన్ కరోనా కేసులున్న విజయవాడ నుంచి సారథి గారు రోజు ఉయ్యురు వచ్చి తిరిగితే తప్పు లేదు కానీ, నా స్వగ్రామం  గ్రీన్ జోన్ అయిన ఉయ్యురులో   నా ఊర్లో నేను తిరిగితే తప్పా? 


12) సారథి తిరిగితే నేను తిరుగుతా. సారథి మీద కూడా కేసులు పెట్టి ఆపితే నేను ఆగుతా.కేసులకు భయపడేది లేదు. ప్రజా సేవే మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. వెనకంజ వేసేది లేదు. 


13) రెడ్ జోన్, కరోనా  కేసులున్న విజయవాడ సిటీ నుంచి  mla సారథి కరోనా కేసులులేని ఉయ్యురు గ్రీన్ జోన్ కి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చెయ్యడం నేరం కాదా? రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి రావద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు పెట్టడం వాస్తవం కాదా? 


14) సారథి ఉయ్యురు వస్తే క్వారంటైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.


15) బాధ్యత గల పౌరుడిగా చట్టాన్ని పోలీసు నిబంధనలను గౌరవిస్తాను అమలు చేస్తాను. అలాగే సారథి గారికి కూడా అదే చట్టాన్ని నిబంధనలని వర్తింప చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము -- రాజేంద్ర ప్రసాద్


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image