బి.జె.పి నేతలచే నాయీ బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

బి.జె.పి నేతలచే నాయీ బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని బి.సి కాలనీలో నివసిస్తున్న నాయీ బ్రాహ్మణుల కుటుంబాలకు గురువారం నాడు భారతీయ జనతా పార్టీ నేతలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్థానిక రామాలయం వద్ద జరిగిన ఈ సరుకుల పంపిణీకి ముఖ్య అతిధిగా తహసిల్ధారు సుధాకర్ రావు హాజరయ్యారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నాయీ  బ్రాహ్మణులు జీవనోపాధి కోల్పోవడం భాధాకరమన్నారు. ప్రజలందరి సం క్షేమం కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు సర్వత్రా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి నేతలు యల్లాల.రఘురామిరెడ్డి, గున్నం.ప్రసాద్ రెడ్డి, బయ్యపురెడ్డి.రవిశంకర్ రెడ్డి, పోకల.మీనాక్షమ్మ, ఆర్.వి.క్రిష్ణారెడ్డి, యల్లాల.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.