కేంద్రం ప్రకటించిన ఆర్థికప్యాకేజీలో ఆంధ్రప్రదేశ్ కు జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉంది: మంత్రి మేకపాటి


తేది : 14.05.2020
అమరావతి


• *ఎంఎస్ఎంఈలకు రాష్ట్రప్రభుత్వం కేటాయించిన రూ.905 కోట్ల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు సిద్ధం*


• *కేంద్రం ప్రకటించిన ఆర్థికప్యాకేజీలో ఆంధ్రప్రదేశ్ కు జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉంది*


• *రుణాలపై మారిటోరియం, టాక్స్ హాలిడే ప్రకటిస్తే బాగుండేది*


• *ఎంఎస్ఎంఈలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి* : *పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* 


అమరావతి, 14 మే : రాష్ట్రప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు కేటాయించిన రూ.905 కోట్ల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని మొదటి అంతస్థులో ఉన్న తన ఛాంబర్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అంశాలను మంత్రి ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందించాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్రం చెప్పిన ప్రకారం చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు(లోన్స్) తీసుకునే అవకాశం ఉందన్నారు. అత్యవసరాల కోసం కేంద్రం అదనంగా రూ.20 వేల కోట్లు కేటాయించి చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిందన్నారు. ఎంఎస్ఎంఈ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఆదాయం ఉండే కంపెనీలకు కూడా ఇప్పుడు అవకాశం రావడం శుభపరిణామన్నారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97 వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఏ ప్రాతిపదికన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందో తేలాల్సి ఉందన్నారు. ఈ ప్యాకేజీని రాష్ట్రాల వారీగా అమలు చేస్తుందా? లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. పాత రుణాలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందా లేదా అన్న అంశం తేలాల్సి ఉందన్నారు. కొత్త రుణాలను పూచీకత్తు లేకుండా ఇస్తారా అన్న అంశంపై మరింత స్పష్టతనిస్తే బాగుంటుందన్నారు. ఎంఎస్ఎంఈలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. రూ. ౩ లక్షల కోట్ల ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు ఇస్తే బాగుంటుందన్నారు. రుణాలపై మారిటోరియం, టాక్స్ హాలిడే ప్రకటిస్తే బాగుండేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.  కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తే పారిశ్రామిక రంగాన్ని ఆదుకోగలుగుతామన్నారు. ఎంఎస్ఎంఈల విద్యుత్ బకాయిలపై ఒత్తిడి చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి వివరించారు. 


ఎంఎస్ఎంఈలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి తోడ్పాటు అందిస్తూనే ఉన్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రెండు వారాల క్రితమే రూ.905 కోట్లు  ఇన్సెంటివ్ ప్యాకేజ్ డిక్లేర్ చేశారని గుర్తుచేశారు. ఎంఎస్ఎంఈలకు విద్యుత్ ఛార్జీలు విషయంలో తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్లినా ఏపీ మాత్రం వాయిదా వేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం  ద్వారా రూ. 128 కోట్లు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరిందన్నారు.  ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తుందని తెలిపారు. రూ.200 కోట్లు కార్పస్ ఫండ్ స్థాపించాలని మంత్రి చెప్పారు. ఇప్పటికే  సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ అమలుకు చర్యలు చేపట్టామని, దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్చేజింగ్ పవర్ పారిటీ పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును అధిగమిస్తుందన్నారు. ఇక రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ప్రజల సాధికారతకు ఉపయోగపడుతున్నాయని మంత్రి తెలిపారు. 


రాష్ట్రానికి ఎల్జీ పాలిమర్స్  కొరియన్ టీం వచ్చిందని, వారు  14 రోజులు ఇక్కడ అధ్యయనం చేయనున్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కుడా ఉన్నారని, హైపవర్  కమిటీ కూడా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని హానికారక రసాయనాలను వినియోగించే 86 పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని మంత్రి తెలిపారు. ఆడిట్ తర్వాతే కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించామన్నారు. 


చివరగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు స్వాగతించాల్సిన అంశమన్నారు. ఈ క్రమంలో మార్గదర్శకాలు త్వరగా అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఒకవేళ అమలు అయ్యే క్రమంలో ఎత్తుపల్లాలు ఉంటే అధిగమించాలని సూచించారు.  


 


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image