విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 

విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు


ఆత్మకూరు.  : మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వార్తలు సేకరించి తన మొబైల్ ఇంటర్నెట్ షాపు  అయినా తన ఆఫీసులో కూర్చుని సోమవారం ఉదయం వార్తలను జిల్లా కార్యాలయానికి  పంపించే క్రమంలో భారత్ టుడే రిపోర్టర్ ప్రసాద్పై ఆత్మకూరు రూరల్ ఎస్ఐ రోజా లతా దౌర్జన్యం చేసి లాఠీతో పలు విధాలుగా కొట్టారని అదే కాకుండా ఎవరివి నీవు అని బెదిరించి జీపులో ఎక్కాలని బలవంతం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ "సిఐ" పాపారావుకు సోమవారం తన కార్యాలయంలో ఆత్మకూర్& ఏఎస్ పేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు  బాధితుడైన భారత్ టుడే రిపోర్టర్ ప్రసాద్ వివరాల మేరకు తాను రోజులుగా వార్తలు సేకరించి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అధికారులకు చేరవేసే దిశలో అన్ని గ్రామాలు తిరిగి విజువల్స్ తీసుకొని ఆత్మకూరు పట్టణంలోని తన ఇంటర్నెట్ మొబైల్ షాప్ అయినా ఆఫీసు నుండి జిల్లా కార్యాలయానికి పంపించడం ఆనవాయితీ అని ఈ తరుణంలో సోమవారం మద్యం షాపుల విజువల్స్ తీసుకుని పలు ప్రజా సమస్యల విజువల్స్ తో పాటు జిల్లా కార్యాలయానికి పంపించే పనిలో ఉండగా  అక్కడికి చేరుకున్న రూరల్ ఎస్ఐ రోజాలతో షాప్ ఎందుకు తీశావని ఆగ్రహంతో విలేఖరి వద్దకు చేరుకుని దౌర్జన్యం ప్రదర్శించారని  నేను మీడియా ప్రతినిధిని వార్తలు సేకరించి హెడ్డాఫీసుకు పంపిస్తున్నానని అందుకు షాపు వద్దకు వచ్చానని ఓ పక్క చెబుతున్నా  తన వద్ద ఉన్న మీడియా ఐడి కార్డు  చూపిస్తున్న వారించకుండా చేతులు చూపించి చేతులపై లాఠీని ఘులిపించారని  అంతే కాకుండా నీ పైన కేసు నమోదు చేస్తాను పోలీస్స్టేషన్కు రావాలని భయాందోళన కల్పించడంతో   ఆ సమాచారాన్ని ఆ ప్రాంత మీడియా ప్రతినిధులకు ప్రసాద్ తెలపడంతో  హుటాహుటిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులు బాధితుడితో కలిసి సంఘటనపై సిఐ పాపారావుకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన సిఐ పాపారావు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు  ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో కూడా పలు మండలాల్లో మీడియా ప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాలు పరిపాటిగా మారాయని ఇలాంటి వాటికి మీడియా భయపడదని మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై నిరంతరం పోరాడుతామని మీడియా ప్రతినిధుల సంఘం తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీడియా మిత్రులకు అండగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎస్ పేట  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు  వెంకట సుబ్బయ్య, చాంద్ బాషా, కరిముల్లా, జిలాని, మూర్తి,పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..