విశాఖపట్నం
మే 08.05.2020
ప్రజల రక్షణ, ప్రభుత్వ నిబంధనలు విస్మరించే పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తాం : పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
*విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ర్ట పరిశ్రమలు,ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష...*
* మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు...
సంఘటన జరిగిన ప్రాంతంలో పరిస్ధితి నార్మల్ కు తేవాలని,ఇందుకు అవసరమైన మెటీరియల్ తెప్పించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు.మెటీరియల్ వచ్చింది.అడిషనల్ మెటిరియల్ కూడా ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ప్రజలను రక్షించుకునే చర్యలు చేపట్టడంలో రాజీపడం. ఎంత నష్టం వచ్చినా ప్రజలకు కష్టం కలిగే ఏ పని చేయవద్దనేది ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట అని మంత్రి పేర్కొన్నారు.
స్టైరింగ్ అనేది ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలిలో సేఫ్టీ దశలోనే ఉంది.నిపుణులు చెబుతున్న ప్రకారం అది పల్మరేజ్ అయి కిందపడిపోతుంది.అది భూమిపైగాని,మనిషిపైగాని పడినా ప్రమాదం ఉండదు.
48 గంటలలో ఇవన్నీ జరుగుతాయి.ఎందుకంటే ఎయిర్ క్వాలిటి 24 గంటలక్రితం కంటే ఇప్పుడు చూస్తే మాత్రం నార్మల్ కు వచ్చేస్తుంది.
ఇండస్ర్టీస్ సేఫ్టీ ఆడిట్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటాం.గతంలో కంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో జనాభా డెన్సిటి పెరిగింది కాబట్టి మాపై మరింత బాధ్యత ఉంది.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.నిబంధనలు అతిక్రమిస్తే ఎవరినీ సహించం.
*నిన్న సౌత్ కొరియన్ అంబాసిడర్ కు చెప్పిందే మీకు చెబుతున్నాను.ఇదే ఘటన అమెరికాలోనో,యూరప్ లో జరిగి ఉంటే ఎలా స్పందించే వారో అంతే బాధ్యతగా ఇక్కడ కూడా రెస్పాన్సిబులిటి ఫీల్ అవ్వమని చెప్పాం.*
*ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతవారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.*
ఇక్కడ ప్రొడక్షన్ ఎవరూ స్టార్ట్ చేయలేదు.రెగ్యులర్ మెయింటెనెన్స్ కింద ఉంటుంది.వాళ్లు చేయాల్సిన ప్రొటోకాల్స్ లో ఎక్కడో లోపం వచ్చింది కాబట్టే ప్రమాదం జరిగింది.
సిస్టమ్ ఎక్కడ ఫెయిలైందో అది రీవర్క్ చేసుకుని ప్రమాదకరపరిస్ధితులు లేకుండా చర్యలు తీసుకుంటాం.అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.
ఎల్జి పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు, నిపుణులతోనూ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి గౌతం రెడ్డి.. విశాఖ ఘటన దురదృష్టకరం అన్నారు.
కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా సీఎం వైయస్ జగన్ వ్యవహరించారు. ప్రమాదం ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి అన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారు.ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్ చేయమని గ్రీన్ట్రిబ్యునల్ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్రెడ్డి అభినందించారు.
(పరిశ్రమల శాఖను అప్రమ
నాతో సహా మంత్రులను విశాఖకు పంపించి సాధారణ పరిస్థితి వచ్చేలా చూడాలని సీఎం శ్రీ జగన్ చెప్పారు.
ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్ చేయమని నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ ఆదేశించిందని మంత్రి తెలిపారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను స్వగ్రామాలకు అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, స్థానిక యువత, వైద్యులు వెంటనే స్పందించి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్రెడ్డి అభినందించారు.
ప్రమాదానికి కారణమైన ట్యాంక్ పరిస్థితి, ఇతర ట్యాంక్ల పరిస్థితిపై రివ్యూ చేశామని మంత్రి వెల్లడించారు.
ట్యాంక్ ఉష్ణోగ్రత 120 కన్నా తక్కువగా ఉందన్నారు. కొన్ని రసాయనాలు వినియోగించి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని మంత్రి వివరించారు. ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నిపుణులను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్నారు. స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉందని, దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. అదేవిధంగా ఇది ఎక్కువ శాతం గాల్లో కూడా ఉండదని.. వెంటనే భూమిపై పడిపోతుందని మంత్రి చెప్పుకొచ్చారు. విశాఖ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన 86 కంపెనీలను గుర్తించామన్నారు. ఈ కంపెనీల్లో భద్రత ప్రమాణాలు పరిశీలించిన తరువాతే ఓపెనింగ్కు అనుమతులు ఇస్తామని మంత్రి గౌతం రెడ్డి స్పష్టం చేశారు.
భవిష్యత్లో నివాస ప్రాంతాల దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపడతాం’ అని గౌతమ్ రెడ్డి అన్నారు.
----------------------------------------